ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shocking: వాటర్ బాటిల్‌లో మూత్రాన్ని నింపి.. ఓ విద్యార్థిని స్కూల్‌బ్యాగ్‌లో పెట్టిన కుర్రాళ్లు.. మధ్యాహ్న భోజన సమయంలో..!

ABN, First Publish Date - 2023-08-01T15:32:54+05:30

ప్రస్తుతం పాఠశాల స్థాయి విద్యార్థులు కూడా వివిధ రకాల నేరాలకు పాల్పడుతూ.. తమ జీవితాలను నాశానం చేసుకుంటున్నారు. కొందరైతే విద్యార్థినుల పట్ల అమానుషంగా ప్రవర్తించి, అందరి ఆగ్రహానికి గురవుతుంటారు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. తాజాగా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం పాఠశాల స్థాయి విద్యార్థులు కూడా వివిధ రకాల నేరాలకు పాల్పడుతూ.. తమ జీవితాలను నాశానం చేసుకుంటున్నారు. కొందరైతే విద్యార్థినుల పట్ల అమానుషంగా ప్రవర్తించి, అందరి ఆగ్రహానికి గురవుతుంటారు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. తాజాగా, రాజస్థాన్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కొందరు విద్యార్థులు తన తోటి విద్యార్థిని బాటిల్లో మూత్రం నింపి బ్యాగులో పెట్టారు. మధ్యాహ్న భోజన సమయంలో విషయం బయటపడడంతో చివరకు ఏం జరిగిందంటే..

రాజస్థాన్ (Rajasthan) బిల్వారా జిల్లా లుహారియా ప్రాంత పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో (Government school) ఇటీవల అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ విద్యార్థినిని టార్గెట్ చేసిన తోటి విద్యార్థులు చివరకు దారుణానికి పాల్పడ్డాడు. పాఠశాలకు వచ్చిన బాలికకు (girl) బ్యాగులోని బాటిల్‌ని తీసుకున్న కొందరు విద్యార్థులు, అందులో మూత్రం (urine) పోశాడు. తర్వాత బాటిల్‌ని యథావిధిగా బాలిక బ్యాగులో పెట్టి, అందులో ఐ లవ్ యూ.. అని రాసిన లెటర్‌ని కూడా పెట్టాడు. మధ్యాహ్న భోజన సమయంలో నీళ్లు తాగుతున్న క్రమంలో విద్యార్థినికి అనుమానం రావడంతో విషయం బయటపడింది. ఈ విషయాన్ని పాఠశాల హెచ్‌ఎం దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.

Viral Video: అటూ ఇటూ తిప్పి కింగ్ కోబ్రానే తికమకపెట్టారు.. ఆదమరచి ఉన్న సమయంలో.. చివరికి అతడు చేసిన పని చూడండి..

ఇంటికి వెళ్లిన బాలిక.. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. చివరకు వారంతా కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ వారు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతా కలిసి నిరసనకు దిగారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు పోలీసు బలగాలు రంగంలోకి దిగి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుతూ, ఈ పాఠశాలలో చోటు చేసుకున్న ఘటనపై ఇంకా అధికారికంగా ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. ప్రస్తుతం విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో (Viral news) తెగ వైరల్ అవుతోంది.

Teacher: క్లాస్‌రూమ్‌లోనే నిద్రపోతున్న టీచర్.. మొబైల్‌లో ఫొటోను తీసిన హెడ్మాస్టర్.. చివరకు ఊహించని సీన్..!

Updated Date - 2023-08-01T15:32:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising