ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Parents: పెళ్లయిన 7 ఏళ్లకు అందిన సంతానం.. అల్లారు ముద్దుగా పెంచుకుంటోంటే.. 4 ఏళ్ల వయసుకే ఇలా జరిగిందేంటి..?

ABN, First Publish Date - 2023-06-29T20:49:45+05:30

వివాహమైన తర్వాత దంపతులు తమకు త్వరగా సంతానం కావాలని పరితపిస్తుంటారు. అయితే కొందరికి త్వరగా సంతానం అందితే.. మరికొందరికి చాలా ఆలస్యంగా అందుతుంటుంది. ఇంకొందరు సంతానం కోసం గుళ్లు, గోపురాల చుట్టూ తిరుగుతూ పూజలు చేస్తుంటారు. అయినా చివరికి ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వివాహమైన తర్వాత దంపతులు తమకు త్వరగా సంతానం కావాలని పరితపిస్తుంటారు. అయితే కొందరికి త్వరగా సంతానం అందితే.. మరికొందరికి చాలా ఆలస్యంగా అందుతుంటుంది. ఇంకొందరు సంతానం కోసం గుళ్లు, గోపురాల చుట్టూ తిరుగుతూ పూజలు చేస్తుంటారు. అయినా చివరికి నిరాశే మిగులుతుంటుంది. ఇలాంటి సందర్భాల్లో చాలా ఏళ్లకు కొందరికి అనూహ్యంగా పిల్లలు కలుగుతుంటారు. లేకలేక పుట్టిన పిల్లల్ని చూసుకుని ఎంతో మురిసిపోతుంటారు. తాజాగా, రాజస్థాన్‌కు చెందిన దంపతుల విషయంలోనూ ఇలాగే జరిగింది. పెళ్లయిన 7ఏళ్లకు కొడుకు జన్మించాడు. పిల్లాడిని అల్లారు ముద్దుగా పెంచుకుంటోంటే.. 4 ఏళ్ల వయసుకే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

రాజస్థాన్ (Rajasthan) భిల్వారా జిల్లా బిజోలియా పోలీస్ స్టేషన్ పరిధి జాజ్‌పూర్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆకాష్ మీనా, ప్రేమ్ దేవి మీనా దంపతులకు 11 ఏళ్ల క్రితం వివాహమైంది. అందరిలాగే వీరు కూడా త్వరగా సంతానం కావాలని కోరుకున్నారు. అయితే వీరి కోరిక మాత్రం నెరవేరలేదు. దీంతో ఎన్నో ఆలయాలను సందర్శించి పూజలు చేశారు. అలాగే చాలా ఆస్పత్రుల్లో చికిత్స కూడా తీసుకున్నారు. అయినా వీరికి సంతానం మాత్రం కలగలేదు. దీంతో దంపతులు తీవ్ర మానసిక ఒత్తిడికి (mental stress) గురయ్యారు. ఇక సంతానం కలగదేమో అని అనుకునే సమయంలో నాలుగేళ్ల క్రితం అనూహ్యంగా వీరి కోరిక ఫలించి.. ప్రేమ్ దేవి ఓ బాబుకు జన్మనిచ్చింది. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పిల్లాడిని అల్లారు ముద్దుగా చూసుకునే వారు.

Dog vs Leopard: అర్ధరాత్రి సైలెంట్‌గా ఇంట్లోకి చిరుతపులి ఎంట్రీ.. పెంపుడు కుక్క చూసి అరుస్తోంటే.. అదేం చేసిందో చూస్తే..!

తర్వాత వీరికి కూతురు కూడా జన్మించింది. సంతానం కలగడంతో వీలు ఉన్నప్పుడల్లా గతంలో వెళ్లిన ఆలయాలకు మళ్లీ వెళ్లి మొక్కులు చెల్లించుకుంటూ ఉండేవారు. ఈ క్రమంలో గురువారం ఏకాదశిని పురస్కరించుకుని పిల్లల్ని తీసుకుని సమీపంలోని గుడికి వెళ్లారు. అక్కడ మొక్కులు చెల్లించుకుని సంతోషంగా బైకుపై ఇంటికి బయలుదేరారు. ఈ ఆనందం కొన్ని గంటల్లో ఆవిరవుతుందని వారు ఊహించలేకపోయారు. మార్గమధ్యలో వీరి బైకును (lorry hit the bike) ఓ లారీ ఢీకొట్టింది. బాలుడి పైనుంచి వెళ్లడంతో శరీరం నుజ్జునుజ్జయింది. కళ్ల ముందే కొడుకు చనిపోవడం చూసి తల్లి స్పృహ తప్పి పడిపోయింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బాలుడు.. నాలుగేళ్లకే మృత్యు ఒడిలోకి జారుకోవడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలోకపోతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

Viral Video: స్నేహితుడే కదా అని స్కూటీ ఆపితే.. మాట్లాడాల్సిందే అంటూ యువతి వద్దకు వెళ్లి.. చివరకు అతడు చేసిన నిర్వాకం..

Updated Date - 2023-06-29T20:49:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising