ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Wife: మొదటి అంతస్తులోని ఓ గదిలోంచి అరుపులు కేకలు.. తాళాలు పగలగొట్టి చూస్తే ఇనుప గొలుసులతో కనిపించాడో వ్యక్తి.. ఏమైందని అడిగితే..

ABN, First Publish Date - 2023-04-12T13:59:28+05:30

యూపీలోని బిజ్నోర్ జిల్లాలో (Bijnor District) వెలుగులోకి వచ్చిన ఓ ఘటన చుట్టుపక్కల వారిని షాక్‌కు గురి చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఇంటర్నెట్ డెస్క్: యూపీలోని బిజ్నోర్ జిల్లాలో (Bijnor District) వెలుగులోకి వచ్చిన ఓ ఘటన చుట్టుపక్కల వారిని షాక్‌కు గురి చేసింది. స్థానికంగా ఉండే ఓ భవనం మొదటి అంతస్తులోని ఒక గదిలోంచి కంటిన్యూస్‌గా అరుపులు కేకలు వినిపించడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి సమాచారంతో వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు అరుపులు వినిపిస్తున్న గది తలుపులు పగలగొట్టి చూస్తే.. లోపల కనిపించిన దృశ్యం వారిని నిర్ఘాంతపోయేలా చేసింది. ఓ వ్యక్తి కాళ్లు, చేతులు సంకేళ్లతో బంధించబడి నిస్సహాయంగా పడి ఉన్నాడు. దాంతో వెంటనే అతడి కాళ్లు, చేతులకు ఉన్న సంకేళ్లను తొలగించి ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతడు చెప్పిన విషయాలు విని పోలీసులకు నోట మాట రాలేదు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నూర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని (Noorpur Police Station) మొరదాబాద్ రోడ్‌లో ఉండే మహ్మద్ హసీం అనే వ్యక్తి తన మొదటి భార్య చనిపోవడంతో అఫ్రీన్‌ను (Afreen) రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే, వివాహమైన తర్వాతి నుంచి దంపతులిద్దరి మధ్య ప్రతిరోజు గొడవలు జరిగేవి. ప్రతి చిన్న విషయానికి హసీంతో అఫ్రీన్ వాగ్వాదానికి దిగేది. ఇటీవల ఈ గొడవలు ఇంకా పెరిగాయి. దాంతో అఫ్రీన్ భర్త పట్ల కర్కశత్వంగా ప్రవర్తించింది. హసీం కాళ్లు, చేతులను గొలుసులతో కట్టేసి ఓ గదిలో పడేసింది. కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదు. అలా మూడు రోజులు గడిచిపోయాయి. దాంతో హసీం తనను బంధించిన గది కిటికీలోంచి సాయం కోసం కేకలు వేయడం మొదలెట్టాడు. మొదట అతడి అరుపులు విన్న చుట్టుపక్కల వారు రోజూ దంపతుల మధ్య జరిగే గొడవలే ఉంటాయిలే అని లైట్ తీసుకున్నారు. కానీ, మూడు రోజులుగా అదేపనిగా హసీం కేకలు వినిపించడం గమనించిన స్థానికులకు అనుమానం వచ్చింది. దాంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

అన్నీ మర్చిపోదాం.. ఇంటికి రండని పిలిస్తే.. ప్రేమ పెళ్లయిన 4 ఏళ్లకు భార్యతో సహా ఇంటికి వెళ్లాడా భర్త.. 10 రోజుల తర్వాత..


వారి సమాచారంతో అక్కడికి వచ్చిన పోలీసులు హసీం ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూశారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి నిర్ఘాంతపోయారు. హసీం కాళ్లు, చేతులు ఇనుప గొలుసులతో కట్టేసి ఉండడం చూసి షాకయ్యారు. దాంతో అతడిని కట్టేసిన గొలుసులను తీసేసి, బాగా నీరసంగా ఉండడంతో చికిత్స కోసం స్థానికంగా ఉండే ప్రాథమిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి చికిత్స చేసిన అనంతరం జరిగిన విషయం అడిగి తెలుసుకున్నారు. భార్య అఫ్రీన్ తనను ఇలా గదిలో బంధించి మూడు రోజులు అవుతున్నట్లు అతడు చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. మూడు రోజుల నుంచి అన్నం నీళ్లు పెట్టకుండా నరకం చూపించిందని వాపోయాడు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి నీరజ్ శర్మ వెల్లడించారు.

తక్కువ ఖర్చుతో థాయ్‌లాండ్ సందర్శించాలనుకుంటున్నారా? అయితే ఈ అద్భుత అవకాశం మీకోసమే..


Updated Date - 2023-04-12T13:59:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising