TS News: ఇందారంలో యువకుడి హత్యలో కొత్త కోణం
ABN, First Publish Date - 2023-04-25T14:59:34+05:30
జిల్లాలోని ఇందారంలో నడిరోడ్డుపై యువకుడిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.
మంచిర్యాల: జిల్లాలోని ఇందారంలో నడిరోడ్డుపై యువకుడిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఇందారంలో మహేష్(25) అనే యువకుడు దారుణ హత్య గురయ్యాడు. వివాహితను వేధిస్తున్నాడనే హత్య జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పెళ్లికి ముందు యువతి, మహేష్ మధ్య ప్రేమ వ్యవహారం నడువగా.. విషయం తెలిసిన కుటుంబసభ్యులు యువతిని వేరొకరికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇది జీర్ణించుకోలేని మహేష్.. యువతి భర్తకు తమ వీడియోలు, ఫొటోలు పంపించాడు. ఈ క్రమంలో అవమానభారంతో యువతి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. మహేష్ వల్లే యువతి భర్త ఆత్మహత్య చేసుకున్నాడని.. అతడిపై యువతి కుటుంబసభ్యులు కక్ష పెంచుకున్నారు. అదును చూసి మహేష్ను అత్యంత కిరాతకంగా హతమార్చారు. నడిరోడ్డుపై ఇద్దరు మహిళలు, ఇద్దరు యువకులు కలిసి మహేష్ను బండరాయితో కొట్టి చంపారు. అందరూ చూస్తుండగానే యువతి కుటుంబసభ్యులు ఈ దారుణానికి పాల్పడ్డారు. హత్యా దృశ్యాలను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్గా మారింది. మహేష్ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2023-04-25T15:06:53+05:30 IST