Share News

Hyderabad: ఎల్వీప్రసాద్ ఆసుపత్రి వద్ద మహిళను ఢీ కొన్న బస్సు

ABN , Publish Date - Dec 17 , 2023 | 09:48 AM

హైదరాబాద్: బంజారాహిల్స్ ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వద్ద ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న మహిళను బస్సు ఢీ కొంది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

Hyderabad: ఎల్వీప్రసాద్ ఆసుపత్రి వద్ద మహిళను ఢీ కొన్న బస్సు

హైదరాబాద్: బంజారాహిల్స్ ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వద్ద ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న మహిళను బస్సు ఢీ కొంది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పార్క్ హయత్‌ హోటల్‌లో సెక్యూరిటీ గార్డుగా ఆమె పని చేస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలు చంద్రకళ (35) వనస్థలిపురంకు చెందిన మహిళగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - Dec 17 , 2023 | 09:49 AM