ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad: ఆరోగ్యం బాలేదని బంధువుల ఇంటికి వెళ్తుండగా..

ABN, First Publish Date - 2023-02-25T09:49:18+05:30

ఆరోగ్యం బాలేదని రెస్ట్ తీసుకునేందుకు ఆమె బైక్ పై బంధువుల ఇంటికి వెళుతోంది. ఇంతలోనే అనుకోని సంఘటన..ఒక్కసారిగా కళ్లు తిరిగాయి..ఉన్నట్టుండి బైక్ పై నుంచి పడిపోయింది. వెనక నుంచి వస్తున్న బస్సు ఆమె తలపై నుంచి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వనస్థలిపురం, ఆంధ్రజ్యోతి: ఆరోగ్యం బాలేదనీ తమ బంధువుల ఇంటికి ర్యాపిడో ద్విచక్ర వాహనం అద్దెకు తీసుకుని వెళ్తున్న ఇంజనీరింగ్‌ విద్యార్థిని ప్రమాదవశాత్తు రోడ్డుపై పడిపోవడంతో అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఆమె మీదనుంచి వెళ్లింది. దీంతో విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన వనస్థలిపురం పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో శుక్రవారం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ టౌన్‌ చైతన్యపురి కాలనీకి చెందిన మానె సంకీర్తన(18) నగరంలోని చైతన్యపురి కాలనీలో ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటూ నాగోలులోని శ్రేయాస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఇంజనీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. కాగా, శుక్రవారం ఆరోగ్యం బాగలేదనీ సంకీర్తన తన తల్లిదండ్రులకు చెప్పడంతో వనస్థలిపురం శారదానగర్‌లో నివాసముంటున్న బంధువుల ఇంటికి వెళ్లమన్నారు. దీంతో ఆమె ర్యాపిడో బైక్‌ను తీసుకుని శుక్రవారం రాత్రి బయలుదేరింది. వనస్థలిపురం పనామా వద్దకు రాగానే ఆమె కళ్లుతిరిగి బైక్‌పైనుంచి కింద పడిపోయింది. దీంతో అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఆమె తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

Updated Date - 2023-02-25T09:49:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising