ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: 12:45 గంటలకు ఎల్బీ స్టేడియంకు చేరుకోనున్న రేవంత్ రెడ్డి

ABN, First Publish Date - 2023-12-07T12:04:57+05:30

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డ్ హోటల్ తాజ్ కృష్ణ నుంచి సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో కలిసి నేరుగా 12:45 గంటలకు ఎల్బీ స్టేడియంకు చేరుకుంటారు. గవర్నర్ తమిళి సై సౌందరరాజన్‌ 12:55 గంటలకు ఎల్బీ స్టేడియంకు వస్తారు.

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డ్ హోటల్ తాజ్ కృష్ణ నుంచి సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో కలిసి నేరుగా 12:45 గంటలకు ఎల్బీ స్టేడియంకు చేరుకుంటారు. గవర్నర్ తమిళి సై సౌందరరాజన్‌ 12:55 గంటలకు ఎల్బీ స్టేడియంకు వస్తారు. ముహూర్తం ప్రకారం 1.04 గంటలకు గవర్నర్‌ రేవంత్ రెడ్డితో ప్రమాణం చేయించనున్నారు. 1:25 గంటలకు డిప్యూటీ సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారం చేస్తారు. చివరగా గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రి మండలితో గ్రూప్ ఫోటో ఉంటుంది. దీంతో కార్యక్రమం ముగుస్తుంది.

సీఎం రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా.. గురువారం ఎల్‌బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్‌ సిటీ ట్రాఫిక్‌ అడిషనల్‌ సీపీ సుధీర్‌బాబు ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రితో పాటు.. పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దాంతో రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, అధికారులు పెద్దఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఎల్‌బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయని అడిషనల్‌ సీపీ వెల్లడించారు.

Updated Date - 2023-12-07T12:04:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising