ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS NEWS: మంత్రి మల్లారెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. ABVP నాయకుల ధర్నా

ABN, First Publish Date - 2023-08-29T15:47:18+05:30

విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ABVP నాయకులు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. నిరసనల్లో భాగంగా మంగళవారం మేడ్చల్(medchal) పట్టణంలోని మంత్రి మల్లారెడ్డి క్యాంపు కార్యాలయాన్ని(Mallareddy camp office) ముట్టడించేందుకు ABVP నాయకుల(ABVP leaders) యత్నించారు.

మేడ్చల్: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ABVP నాయకులు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. నిరసనల్లో భాగంగా మంగళవారం మేడ్చల్(medchal) పట్టణంలోని మంత్రి మల్లారెడ్డి క్యాంపు కార్యాలయాన్ని(Mallareddy camp office) ముట్టడించేందుకు ABVP నాయకుల(ABVP leaders) యత్నించారు. ఈ సమయంలో నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు నాయకులకు మధ్య ఘర్షణ నెలకొంది. పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో విద్యార్థులు గాయపడ్డారు. కొందరు విద్యార్థి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం కేసీఆర్ వెంటనే విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. అలాగే మేడ్చల్ జిల్లాలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలనే ABVP నాయకుల ధర్నా చేపట్టారు.చేతకాని ప్రభుత్వమా గద్దె దిగు అంటూ ఏబీవీపీ నేతలు నినాదాలు చేశారు. పెండింగ్‌లో ఉన్న ఫీజురియంబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2023-08-29T15:47:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising