ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tragedy: అనారోగ్యంతో కూతురు మృతి.. చిట్టి తల్లీ నీ వెంటే నేను అంటూ తండ్రి కూడా...

ABN, First Publish Date - 2023-08-28T12:34:24+05:30

ఆ తండ్రికి కూతురు అంటే ఎంతగానో ప్రేమ. ఆ చిట్టి తల్లి చెప్పే ముద్దు ముద్దు మాటలు వింటూ తండ్రి ఎంతగానో మురిసిపోయాడు.

హైదరాబాద్: ఆ తండ్రికి కూతురు అంటే ఎంతగానో ప్రేమ. ఆ చిట్టి తల్లి చెప్పే ముద్దు ముద్దు మాటలు వింటూ తండ్రి ఎంతగానో మురిసిపోయాడు. అయితే వీరిద్దరి అనురాగాన్ని చూసి విధికి కుళ్లుపుట్టిందేమో.. ఆ ఇంటిన ఒక్కసారిగా విషాదం కమ్మేసింది. ఎంతో అల్లారుముద్దుగా చూసుకునే కుమార్తె విగతజీవిగా మారిపోయింది. కళ్లముందే కుమార్తె మృతిని చూసి ఆ తండ్రి గుండె తట్టుకోలేకపోయింది. దీంతో చిట్టి తల్లి నీవెంటే నేను అంటూ ఆ తండ్రి కూడా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన భాగ్యనగరంలో చోటు చేసుకుంది. నగరంలోని ఖైరతాబాద్‌లో విషాదం నెలకొంది. తండ్రీ, కూతుళ్ల మరణం ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. ఐదేళ్ల కూతురు ఆరాధ్య అనారోగ్యంతో మృతి చెందింది. కళ్ల ముందే కూతురు మరణించడాన్ని చూసి తండ్రి కిషోర్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. చివరకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కూతురు మృతిని తట్టుకోలేక కిషోర్ ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కూతరు మృతితో కోలుకోలేని ఆ కుటుంబం వెను వెంటనే ఇంటి యజమాని కూడా మరణించడం బాధిత కుటుంబాన్ని షాక్‌కు గురిచేసింది. ఈ హృదయ విదారక ఘటన స్థానికులను ఎంతగానో కలిచివేసింది. సమాచారం అందిన వెంటనే రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని కిషోర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఒకే ఇంట్లో ఇద్దరు మృతిలో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలిపిస్తున్నారు.

Updated Date - 2023-08-28T12:34:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising