ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister Sabita: విద్యాశాఖ అధికారులపై మంత్రి సబిత సీరియస్.. ఉద్యోగాలు పోతాయంటూ హెచ్చరిక

ABN, First Publish Date - 2023-04-04T20:34:06+05:30

ఉద్యోగులు అక్రమాలకు పాల్పడితే సీరియస్ యాక్షన్ ఉంటుందని మంత్రి సబిత హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్‌: విద్యాశాఖపై మంత్రి సబితాఇంద్రారెడ్డి (Minister Sabita Indra Reddy) సమీక్ష ముగిసింది. కలెక్టర్లతో మంత్రి సబిత వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.టెన్త్‌ పేపర్‌ లీక్‌ (10th Exam Papers Leak) నేపథ్యంలో అధికారులు, కలెక్టర్లతో మంత్రి సబిత చర్చించారు. విద్యాశాఖ అధికారులపై మంత్రి సబిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నాన్ సీరియస్‌గా ఉంటే ఉద్యోగాలు పోతాయని, ఉద్యోగులు అక్రమాలకు పాల్పడితే సీరియస్ యాక్షన్ ఉంటుందని మంత్రి సబిత హెచ్చరించారు.

తెలంగాణలో టీఎస్‌‌పీఎస్సీ పేపర్ లీకుల (TSPSC Paper Leakage) బెడద ఇంకా కొలిక్కి రాకముందే.. వరుసగా పదో తరగతి పరీక్షల పత్రాలు (10th Exam Papers) లీకవ్వడంతో రాష్ట్ర విద్యాశాఖలో అసలేం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో కేసీఆర్ సర్కార్‌పై (KCR Govt) ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. పేపర్ లీకుల సంగతి పక్కనెడితే.. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలోని (Adilabad) ఉట్నూరు మండల కేంద్రంలో పదో తరగతి విద్యార్థుల ఆన్సర్ షీట్స్ (10th Students Answer Sheets) మాయం అయ్యాయి. అటు లీక్.. ఇటు మిస్సింగ్ ఈ వరుస ఘటనలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. మొత్తం 20 మంది విద్యార్థుల జవాబు పత్రాలు కనిపించకుండా పోయినట్లు మొదట వార్తలు వచ్చాయి.

తపాలా కార్యాలయం నుంచి ఉట్నూర్ బస్టాండ్‌కు తరలిస్తుండగా ఆటో నుంచి మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పేపర్లు ఆటోలో తరలిస్తుండగా.. కిందపడిపోయి ఉంటాయా..? లేదంటే ఎవరైనా కావాలని మాయం చేశారా..? అనే తేల్చే పనిలో పడ్డారు. మంగళవారం సాయంత్రానికి ఈ ఆన్సర్ షీట్స్ మాయమైన వ్యవహారంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి అసలేం జరిగిందో తేల్చారు.

మాయమైన ఆన్సర్ షీట్స్ సప్లిమెంటరీ విద్యార్థులవిగా నిర్ధారణకు వచ్చినట్లు పోలీసులు స్పష్టం చేశారు. మొత్తం 9 మంది విద్యార్థుల ఆన్సర్ షీట్స్ పోయినట్టు గుర్తించామని పోలీసులు మీడియాకు వెల్లడించారు. అయితే.. తమ తప్పేమీ లేదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. తపాలా శాఖ నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగిందని విద్యాశాఖ అధికారులు, పోలీసులు చెబుతున్నారు. అయితే.. ఆన్సర్ షీట్స్ మాయంపై అన్నికోణాల్లో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. ఆన్సర్ షీట్స్ తరలించే క్రమంలో తపాలశాఖ అత్యంత నిర్లక్ష్యంగా, కనీసం ఎస్కార్ట్ కూడా లేకుండా వ్యవహరించిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - 2023-04-04T20:36:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising