Crime News: మహేష్ దారుణ హత్య కేసులో నిందితుల అరెస్టు
ABN, First Publish Date - 2023-04-27T12:13:44+05:30
మంచిర్యాల జిల్లా: ఇందారంలో మహేష్ (Mahesh)ను దారుణంగా హత్య చేసిన కేసు (Murder Case)లో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
మంచిర్యాల జిల్లా: ఇందారంలో మహేష్ (Mahesh)ను దారుణంగా హత్య చేసిన కేసు (Murder Case)లో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అదే గ్రామానికి చెందిన కనకయ్యతో పాటు అతని భార్య పద్మ, కుమార్తెలు శృతి, శ్వేత, కుమారుడు సాయిలను అరెస్టు చేశారు. ఆ వివరాలను జైపూర్ ఏసీపీ నరేందర్ మీడియాకు వెల్లడించారు.
శృతి -మహేష్ గతంలో ప్రేమించుకున్నారు. ఆ చనువుతో న్యూడ్ వీడియోలు షేర్ చేసుకున్నారు. న్యూడ్ వీడియోలను మహేష్ సోషల్ మీడియాలో పెట్టడంతో శృతి కుటుంబం అవమానంగా భావించింది. దీంతో ఎలాగైనా మహేష్ను చంపాలని కొద్ది రోజులుగా ప్లాన్ చేశారు. రెండు రోజుల క్రితం ఇంటి ముందు నుంచి వెళుతున్న మహేష్ను శృతి కుటుంబ సభ్యులు అడ్డగించి మూకుమ్మడిగా దాడి చేసి హత్యకు పాల్పడ్డారు.
వివాహిత శృతిని వేధిస్తున్నాడనే హత్య జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పెళ్లికి ముందు యువతి, మహేష్ మధ్య ప్రేమ వ్యవహారం నడువగా.. విషయం తెలిసిన కుటుంబసభ్యులు యువతిని వేరొకరికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇది జీర్ణించుకోలేని మహేష్.. యువతి భర్తకు తమ వీడియోలు, ఫొటోలు పంపించాడు. ఈ క్రమంలో అవమానభారంతో యువతి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. మహేష్ వల్లే యువతి భర్త ఆత్మహత్య చేసుకున్నాడని.. అతడిపై శృతి కుటుంబసభ్యులు కక్ష పెంచుకున్నారు. అదును చూసి మహేష్ను అత్యంత కిరాతకంగా హతమార్చారు. నడిరోడ్డుపై బండరాయితో కొట్టి చంపారు. అందరూ చూస్తుండగానే యువతి కుటుంబసభ్యులు ఈ దారుణానికి పాల్పడ్డారు. హత్యా దృశ్యాలను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్గా మారింది. మహేష్ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2023-04-27T12:13:44+05:30 IST