ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CM KCR.. 16న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వెట్‌రన్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

ABN, First Publish Date - 2023-09-06T16:50:40+05:30

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 16వ తేదీన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వెట్ రన్‌ను ప్రారంభించనున్నారు. నార్లాపూర్ ఇన్ టేక్ వద్ద స్విచ్ ఆన్ చేసి ప్రారంభిస్తారు. ప్రపంచంలోనే భారీ పంపులతో ఎత్తిపోతలకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సిద్ధమైంది.

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఈ నెల 16వ తేదీన పాలమూరు-రంగారెడ్డి (Palamuru-RangaReddy) ఎత్తిపోతల వెట్ రన్‌ (Veteran)ను ప్రారంభించనున్నారు. నార్లాపూర్ (Narlapur) ఇన్ టేక్ వద్ద స్విచ్ ఆన్ (Switch on) చేసి ప్రారంభిస్తారు. ప్రపంచంలోనే భారీ పంపులతో ఎత్తిపోతలకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సిద్ధమైంది. 2 కిలో మీటర్ల దూరంలోని నార్లపూర్ రిజర్వాయర్‌లోకి నీటి ఎత్తిపోత జరగనుంది. ఈ సందర్భంగా కృష్ణమ్మ తల్లికి సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అదే రోజు భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి పాలమూరు రంగారెడ్డి జిల్లాల్లోని పల్లె పల్లె నుంచి ప్రజలు, గ్రామ సర్పంచులు హాజరుకానున్నారు. ఎత్తిపోతల కృష్ణమ్మ జలాలను కలశాలతో ప్రతి గ్రామానికి తీసుకుపోయి ఈనెల 17న ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలలోని ప్రతీ గ్రామంలో ప్రజలు, గ్రామ సర్పంచులు దేవుళ్ళ పాదాలకు అభిషేకం చేయనున్నారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అడ్డంకులు తొలిగి కొలిక్కి వచ్చినందుకు గ్రామాల్లోని దేవాలయాల్లో స్వామివారి పాదాలను పాలమూరు జలాలతో అభిషేకం చేసి మన మొక్కులు చెల్లించు కుందామని, దక్షిణ తెలంగాణకు పండుగ రోజని అన్నారు. ఎన్నో మొక్కులు మొక్కితే, దైవకృపతో, ఇంజనీర్ల కృషితో, పాలమూరు ఎత్తిపోతల పథకం అడ్డంకులు అధిగమించి సాకారమైందని, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన స్ఫూర్తితో పాలమూరు-రంగారెడ్డిని పూర్తి చేయాలనుకున్నామని, పట్టుదలతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను కొలిక్కి తేవడానికి జరిగిన కృషిలో కీలక పాత్ర పోషించిన సీఎంవో అధికారులకు, ఇరిగేషన్ ఉన్నతాధికారులకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ అనుమతులతో పాటు అనేక అడ్డంకులను అధిగమించి చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో దక్షిణ తెలంగాణలోని పల్లె పల్లెకు తాగునీరు, సాగునీరు అందనుందని, బంగారు తెలంగాణ లక్ష్యం సంపూర్ణం కానున్నదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-09-06T16:50:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising