హోరాహోరీగా ఎడ్లబండ్ల పోటీలు
ABN, Publish Date - Oct 21 , 2024 | 11:24 PM
వాల్మీకి జయంతి సందర్భంగా స్థానికంగా సోమవారం నిర్వహించిన ఎడ్లబండ్ల పరుగు పందెం పోటీలు హోరాహోరీగా సాగాయి. విజేతలకు ఎమ్మెల్యే పల్లెసింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి బహుమతులు అందజేశారు.
కొత్తచెరువు, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : వాల్మీకి జయంతి సందర్భంగా స్థానికంగా సోమవారం నిర్వహించిన ఎడ్లబండ్ల పరుగు పందెం పోటీలు హోరాహోరీగా సాగాయి. విజేతలకు ఎమ్మెల్యే పల్లెసింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతి లెజెండ్ ధర్మవరం ఎద్దులకు రూ. 40 వేలు, ద్వితీయ బహుమతి వాలి సునామి వెంకటేశ ఎద్దులకు రూ. 30 వేలు, తృతీయ బహుమతి శ్రీధర్ నాయుడు ఎద్దులకు రూ. 20 వేలు, నాల్గవ బహుమతి చలపతినాయుడు ఎద్దులకు రూ. 10 వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాలక్కగారి శ్రీనివాసులు, కాంట్రాక్టర్ లక్ష్మీనారాయణ, అడపాల రామక్రిష్ణ, ఒలిపి శీన, డిపో భాస్కర్, మాజీ జడ్పీటీసీ లక్ష్మీనారాయణ, బండ్లపల్లి రాజు, వాల్మీకి సంఘం నాయకులు బానుప్రకాశ, విజయ్, శ్రీనివాసులు, నాగేంద్ర, బండి లక్ష్మన్న, అక్కులప్ప, సాకే నరసింహులు, యల్లప్ప, సూర్య, రామకృష్ణ పాల్గొన్నారు.
Updated Date - Oct 21 , 2024 | 11:24 PM