ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

25 లక్షల ప్రతి కుటుంబానికీ ఆరోగ్య బీమా!

ABN, Publish Date - May 01 , 2024 | 05:37 AM

మైనార్టీలకు ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకు, ఖబరిస్తాన్‌లకు స్థలాలు కేటాయింపు, విజయవాడ సమీపంలో హజ్‌హౌస్‌ నిర్మాణం

దేశంలో తొలిసారి ప్రభుత్వ బీమా

సామాన్యులకు ఉచిత ఇసుక విధానం

రైతులకు ఏటా 20 వేల ఆర్థిక సాయం

మెగా డీఎస్సీపై చంద్రబాబు తొలి సంతకం

కూటమి మేనిఫెస్టోలో హామీలు

విడుదల చేసిన బాబు, పవన్‌,సిద్ధార్థనాథ్‌

ఎస్సీ, ఎస్టీ సంక్షేమం

జిల్లా వారీగా వర్గీకరణ అమలు చేస్తాం

ఎస్సీ, ఎస్టీలకు 50 ఏళ్లకే పెన్షన్‌ మంజూరు

సబ్‌ప్లాన్‌ నిధులు వారి అభివృద్ధికే ఖర్చు చేస్తాం

ఏజెన్సీల్లో ఆదివాసీ ఉపాధ్యాయుల నియామకం, జీవో 3 పునరుద్ధరణ

ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాల పునరుద్ధరణ

డా.సుధాకర్‌, డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం, మంత్రూభాయ్‌, డా.అచ్చెన్న హత్యలకు కారకులను కోర్టుల్లో శిక్షపడే విధంగా చర్యలు

ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేస్తాం

ముస్లిం మైనార్టీల సంక్షేమం..

ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్‌

మైనార్టీలకు ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకు, ఖబరిస్తాన్‌లకు స్థలాలు కేటాయింపు, విజయవాడ సమీపంలో హజ్‌హౌస్‌ నిర్మాణం

నూర్‌భాషా కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ప్రతి ఏటా రూ.100 కోట్లు కేటాయింపు

మైనార్టీ పైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణాలు

ఇమామ్‌, మౌజన్‌లకు ప్రతి నెలా రూ.10 వేలు, రూ.5 వేలు గౌరవ వేతనం

అర్హత ఉన్న ఇమామ్‌లకు ప్రభుత్వ ఖాజీలుగా నియామకం

మసీదుల నిర్వహణకు ప్రతి నెలా రూ.5 వేలు ఆర్థిక సాయం, హజ్‌ యాత్రకు వెళ్లే ఒక్కో ముస్లింకు రూ.లక్ష సాయం

క్రిస్టియన్‌ల సంక్షేమం..

క్రిస్టియన్‌ మిషనరీస్‌ ప్రాపర్టీస్‌ డెవల్‌పమెంట్‌ బోర్డు ఏర్పాటు

చర్చిల నిర్మాణం, పునరుద్ధరణకు ఆర్థిక సాయం

స్మశాన వాటికలకు స్థలం కేటాయింపు

జెరూసలెం యాత్రికులకు సాయం

క్షత్రియ సంక్షేమం...

భోగాపురం ఎయిర్‌పోర్టుకు అల్లూరి సీతారామరాజు ఎయిర్‌పోర్టుగా నామకరణం

ప్రజా రాజధాని అమరావతిలో అల్లూరి సీతారామరాజు స్మృతివనం నిర్మాణానికి 5 ఎకరాల స్థలం కేటాయింపు

సామాజిక భద్రత పింఛన్లు పెంపు

రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంపు - ఏప్రిల్‌ నుంచి పెంచిన పెన్షన్‌ అమలు

దివ్యాంగుల పెన్షన్‌ రూ.6 వేలకు పెంచుతాం

పూర్తిస్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు రూ.15 వేలు పెన్షన్‌

కిడ్నీ, తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేలు పెన్షన్‌

పేదలందరికీ నాణ్యమైన ఇళ్లు

గృహ నిర్మాణానికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం మంజూరు చేస్తాం

ఇప్పటి వరకూ మంజూరై పట్టాలు పొందిన వారికి ప్రభుత్వం నుంచి పక్కా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తాం


దేవాలయాలు-బ్రాహ్మణుల సంక్షేమం...

హిందూ దేవాలయాలు, సత్రాల ఆస్తుల పరిరక్షణకు హిందూ ఎండోమెంట్‌ బోర్డు ఏర్పాటు

ప్రైవేటు దేవాలయాల్లోని అర్చకులకు కనీస వేతనం

వార్షిక ఆదాయం రూ.50 వేలకు పైన ఉన్న ఆలయాల అర్చకులకు కనీస వేతనం రూ.15 వేలకు పెంపు

వార్షిక ఆదాయం రూ.50 వేలకు తక్కువ ఉన్న ఆలయాల్లోని అర్చకులకు ధూప, దీప, నైవేద్యం కింద ఇచ్చే మొత్తాన్ని నెలకు 5 వేల నుంచి 10 వేలకు పెంపు

వైదిక, ఆగమశాస్త్ర సంబంధ విషయాల్లో ఆయా ఆలయాలకు పూర్తి స్వతంత్ర ప్రతిపత్తి

తిరుపతి వేయి కాళ్ల మండపం వంటి చారిత్రక కట్టడాల పునరుద్ధరణ

దేవాలయాలకు పూర్తి రక్షణ - గత ప్రభుత్వ హయాంలో దేవాలయాలపై జరిగిన దాడులకు బాధ్యులైన వారికి శిక్షపడేవిధంగా ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు

పురోహితులు, వంట బ్రాహ్మణుల కులవృత్తికి గుర్తింపు

బ్రాహ్మణ కార్పొరేషన్‌, కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ బలోపేతం

తిరుపతి సహా అన్ని దేవాలయాల్లో పూజారితోపాటు ఒక బ్రాహ్మణుడిని ట్రస్ట్‌ బోర్డు మెంబర్‌గా నియామకం

బ్రాహ్మణులు అపరకర్మ చేసుకోవడానికి నియోజకవర్గాల్లో భవనాలు.. వేద విద్యను అభ్యసించిన నిరుద్యోగులకు రూ.3 వేల నిరుద్యోగ భృతి.

అగ్రవర్ణ పేదల సంక్షేమం

కమ్మ, రెడ్డి, వెలమ, అగ్రకులాల కార్పొరేషన్‌లకు తగిన నిధులు కేటాయించి వారి సాధికారత, అభివృద్ధికి చర్యలు చేపడతాం.

కాపు సంక్షేమం..

ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు అదనంగా కాపుల సంక్షేమం కోసం కనీసంగా రానున్న అయిదేళ్లలో రూ.15 వేల కోట్లు నిధులు కేటాయించి కాపుల సాధికారత, అభివృద్ధి కోసం చర్యలు చేపడతాం

కాపు యువత, మహిళల నైపుణ్యాభివృద్ధికి, స్వయం ఉపాధికి ప్రాధాన్యం ఇస్తాం

కాపు భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేస్తాం

ఆర్యవైశ్య సంక్షేమం..

ఆర్యవైశ్య కార్పొరేషన్‌కు తగు మేరకు నిధుల కేటాయింపు

చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాల సౌలభ్యం

స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపార నిర్వహణకు పటిష్ఠ చర్యలు

కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారిక కార్యక్రమంగా చేపడతాం

సాగునీటి రంగం

పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేస్తాం

గాలేరు- నగరి, హంద్రీనీవా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తోటపల్లి రిజర్వాయర్‌, వంశధార-నాగావళి నదుల అనుసంధానం, ప్రాజెక్టుల శీఘ్రతర నిర్మాణానికి చర్యలు

నదుల అనుసంధానం - ప్రతి ఎకరాకు నీరు

రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పూర్తి

పారిశ్రామికీకరణ, పెట్టుబడులు

బ్రాండ్‌ ఏపీని పున:ప్రతిష్ఠించి, భారీస్థాయిలో దేశ విదేశీ పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమల ఏర్పాటు ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు పెద్ద ఎత్తున ఊతమిస్తాం. కొత్త ఇండస్ట్రియల్‌ పాలసీ కింద పూర్తి స్థాయిలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మిషన్‌ లెర్నింగ్‌ వంటి ఆధునిక, సాంకేతిక విజ్ఞానం వినియోగం ద్వారా తగు ప్రోత్సాహం.


మహిళా సంక్షేమం

స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ పెంపు

ప్రత్యేక పథకం ద్వారా పి-4 మోడల్‌లో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి చర్యలు

అంగన్‌వాడీ కార్యకర్తలకు, సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యూటీ చెల్లిస్తాం. ఆశావర్కర్లకు కనీస వేతనం పెంపు దిశగా చర్యలు

ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్‌ వసతి కల్పన

విద్యార్థినులకు కలలకు రెక్కలు

పథకం ద్వారా రుణాలు

పండుగ కానుకలు, పెళ్లి కానుకలు పునరుద్ధరిస్తాంకార్మికులు

రవాణా రంగం: డ్రైవర్‌ సాధికార సంస్థ ఏర్పాటు. డ్రైవర్లకు ప్రమాద బీమా, హెల్త్‌ ఇన్సూరెన్స్‌, విద్యా రుణాలు వంటి సంక్షేమ కార్యక్రమాలు

డ్రైవర్లను ఓనర్లు చేసే లక్ష్యంతో వాహన కొనుగోళ్లకు రూ.4 లక్షల వరకూ పొందే రుణాలపై 5 శాతం పైగా వడ్డీ సబ్సిడీ

బ్యాడ్జ్‌ కలిగిన ప్రతి ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్‌ కలిగిన లారీ, టిప్పర్‌ డ్రైవర్లకు ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం

జీవో 21 రద్దు, వాహనాల గ్రీన్‌ ట్యాక్స్‌ తగ్గింపు

అసంఘటిత రంగ కార్మికులకు చంద్రన్న బీమా పునరుద్ధరణ

భవన నిర్మాణ బోర్డు పునరుద్ధరణ, ముఠా కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు

జర్నలిస్టులు..

అక్రిడేషన్‌ కలిగిన ప్రతి జర్నలిస్టుకు ఉచిత నివాస స్థలం

న్యాయవాదులు...

ఫ న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉచిత న్యాయ సేవల అందుబాటుకు లీగల్‌ కియో్‌స్కల స్థాపన. జూనియర్‌ న్యాయవాదులకు ప్రభుత్వ స్టైఫండ్‌ నెలకు రూ.10 వేలు, జూనియర్‌ న్యాయవాదుల శిక్షణకు ప్రత్యేక ట్రైనింగ్‌ అకాడమీ ఏర్పాటు


పన్నులు, ధరల నుంచి ఉపశమనం

చెత్తపన్ను రద్దు, ఇంటి పన్నుల సమీక్ష

పెట్రోల్‌, డీజిల్‌ ధరల నియంత్రణ

మద్యం ధరల నియంత్రణ, విషపూరిత మద్యం బ్రాండ్లు రద్దు

విద్యుత్‌ చార్జీలు నియంత్రిస్తాం

ఇంటి పైకప్పుపై కేంద్ర ప్రభుత్వ సోలార్‌ అధారిత విద్యుత్‌ ఉత్పత్తి పథకం అనుసంధానం ద్వారా విద్యుత్‌ బిల్లుల భారం తగ్గిస్తా. అదనపు విద్యుత్‌ను ప్రజల నుంచి కొనుగోలు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌..

ఎయిడెడ్‌ కాలేజీలు, ప్రైవేటు పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పునరుద్ధరిస్తాం

కాలేజీలకే రుసుము చెల్లిస్తాం

ఉచిత ఇసుక విధానం

సామాన్యులకు అందుబాటులో ఉండేలా సమగ్ర ఇసుక విధానం

విద్య..

కేజీ టు పీజీ సిలబ్‌సను రివ్యూ చేస్తాం

స్కూళ్ల మూతకు కారణమైన జీవో 117 రద్దు

మూతపడిన పాఠశాలల పున:ప్రారంభం

డా.అంబేడ్కర్‌ విదేశీ విద్య పథకం పునరుద్ధరణ

గంజాయి నిర్మూలన

గంజాయి, డ్రగ్స్‌ మాదకద్రవ్యాల నిర్మూలనకు 100 రోజుల్లో కఠిన చర్యలు చేపడతాం.

ఆక్వా...

అవసరమైన జిల్లాల్లో 5 వేల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన కోల్డ్‌ స్టోరేజీలు, అన్ని జోన్లలో ఉన్న వారికి విద్యుత్‌ యూనిట్‌కు రూ.1.50కే సరఫరా చేస్తాం.

ట్రాన్స్‌ఫార్మర్ల ధరలు తగ్గిస్తాం - ఏవియేటర్లు సబ్సిడీపై అందిస్తాం

సమగ్రాభివృద్ధి..

శీఘ్రతర సమగ్ర ఆర్థికాభివృద్ధికి పటిష్ఠమైన విధానాలను అమలు చేస్తాం.

సంపద సృష్టితో సంక్షేమ పథకాల విస్తృత అమలును పటిష్ఠం చేస్తాం

వికసిత భారత్‌ నిర్మాణానికి చేపడుతున్న పలు చర్యలను రాష్ట్రంలో కూడా అమలు చేస్తాం.

మౌలిక వసతుల కల్పన

గ్రామాల నుంచి మండల, జిల్లా కేంద్రాలకు రోడ్ల నిర్మాణం

సోషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధి

పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రైల్వే ప్రాజెక్టులు త్వరితగతిన నిర్మిస్తాం

వర్క్‌ఫ్రం హోం కోసం ప్రతి మండల, జిల్లా కేంద్రాల్లో వర్క్‌ స్టేషన్ల ఏర్పాటు

ప్రతి ఇంటికీ మంచినీరు సరఫరా

ఉత్తరాంధ్ర అభివృద్ధి

ఆర్థిక రాజధానిగా విశాఖ అభివృద్ధి

వైజాగ్‌-చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌తో ప్రధాన ప్రాంతాల అనుసంధానం

విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు. అవసరమైన భూమి కేటాయిస్తాం

విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షిస్తాం

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, నాగావళి-వంశధార నదుల అనుసంధానం, తోటపల్లి రిజర్వాయర్‌ ఆధునీకరణ

జీడిమామిడి, కొబ్బరి ధరల స్థిరీకరణ

కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్‌ నిర్మాణం

రాయలసీమ అభివృద్ధి..

తాగునీరు, సాగునీరు, విద్య, వైద్య సదుపాయాల ఏర్పాటుకు ప్రాధాన్యం. హార్టికల్చర్‌ హబ్‌గా, విత్తన రాజధానిగా రాయలసీమ

కర్నూలులో తక్షణ హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు

ఆటోమొబైల్‌ హబ్‌గా రాయలసీమ

రాయలసీమ పట్టణాలకు చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్‌ అనుసంధానం

యువగళం యాత్రలో ప్రకటించిన మిషన్‌ రాయలసీమ అమలుకు చర్యలు


చంద్రన్న బీమా పథకం

సహజ మరణానికి రూ.5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షలు బీమా సౌకర్యం

వైద్యం, ఆరోగ్యం..

దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షలు ఆరోగ్య బీమా

ప్రతి పౌరుడికి డిజిటల్‌ హెల్త్‌ కార్డులు

అన్ని మండల కేంద్రాల్లో జన ఔషధి కేంద్రాల ఏర్పాటు

బీపీ, షుగర్‌ వంటి నాన్‌ కమ్యూనికబుల్‌ వ్యాధులకు ఉచితంగా జనరిక్‌ మందుల పంపిణీ

అన్న క్యాంటీన్లు

అన్న క్యాంటీన్ల ఏర్పాటు, డొక్కా సీతమ్మ స్ఫూర్తితో పేదల ఆకలి తీరుస్తాం

పంపిణీ విధానాన్ని సమీక్షించి, పౌరసరఫరాల వ్యవస్థను పటిష్టం చేస్తాం

ప్రజా రాజధానిగా అమరావతి పునర్నిర్మాణం

నవ్యాంధ్ర ప్రగతికి దోహదం చేసే రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి చర్యలు, ఆర్థిక ప్రగతికి చేయూత


బీసీ డిక్లరేషన్‌...

బీసీలకు 50 ఏళ్లకే నెలకు రూ.4 వేల పెన్షన్‌

బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం

బీసీ సబ్‌ప్లాన్‌ ద్వారా ఐదేళ్లలో రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తాం

బీసీలకు రాజకీయ ప్రాధాన్యం

స్థానిక సంస్థలు, నామినేటెడ్‌ పదవుల్లో 34ు రిజర్వేషన్‌

చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్‌ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం

ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలకు నామినేషన్‌ల ద్వారా రాజకీయ భాగస్వామ్యం

బీసీల ఆర్థికాభివృద్ధి, ఉపాధికి ప్రోత్సాహకాలు పునరుద్ధరిస్తాం..

దామాషా ప్రకారం కార్పొరేషన్లకు నిధులు

స్వయం ఉపాధికి రూ.10 వేల కోట్లు

రూ.5,000 కోట్లతో ఆదరణ పునరుద్ధరణ

శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు

యాదవ, కురుబ...

అత్యాధునిక ప్రమాణాలతో గొర్రెల పెంపకం యూనిట్ల స్థాపనకు రాయితీలు, గొర్రెలు, మేకల పెంపకం యూనిట్‌లకు బీమా సౌకర్యం

చేనేతలు...

చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌ చేస్తాం, పవర్‌లూమ్‌లకు 500 యూనిట్లు, హ్యాండ్లూమ్‌లకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్‌

నాయీ బ్రాహ్మణులు..

దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు రూ.25 వేలు గౌరవవేతనం, షాపులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌

రజక..

దోబీఘాట్ల నిర్మాణాలకు ప్రోత్సాహం. విద్యుత్‌ రాయితీ

గీత కార్మికులు...

మద్యం షాపుల్లో 10% కేటాయింపు

వడ్డెర...

క్వారీల్లో 15ు రిజర్వేషన్‌, రాయల్టీ, సీనరీ చార్జీల్లో మినహాయింపు

మత్స్యకారులు

వేట విరామ సమయంలో మత్స్యకారులకు రూ.20 వేల సాయం. జీవో 217 రద్దు

బోట్ల మరమ్మతులు, ఆధునిక కమ్యూనికేషన్‌కు ఆర్థిక సాయం

స్వర్ణకారులు

అభివృద్ధికి కొత్తగా కార్పొరేషన్‌ ఏర్పాటు

హంతకులకు శిక్ష

తోట చంద్రయ్య, అమర్నాథ్‌గౌడ్‌, జల్లయ్య యాదవ్‌, పాల సుబ్బారావు లాంటి బీసీలను హత్య చేసిన వైసీపీ గూండాలకు శిక్షపడేలా చర్యలు


ఉద్యోగస్తులు, పెన్షనర్స్‌

గత ఐదేళ్ల పాలనలో ప్రధాన వ్యవస్థలన్నీ విధ్వంసమయ్యాయి.

ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు, అవమానాలకు గురయ్యారు. వారి గౌరవాన్ని పున:ప్రతిష్టింప చేసి పూర్తి అనుకూల వాతావరణంలో వారు పనిచేసేలా తగు చర్యలు చేపడతాం.

సీపీఎస్‌, జీపీఎస్‌ విధానాన్ని పున:సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తాం

ఉద్యోగులకు మెరుగైన పీఆర్‌సీ అమలు చేస్తాం. అలవెన్స్‌ పేమెంట్స్‌ పైన కూడా పున:పరిశీలన చేస్తాం

ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్‌ ప్రకటిస్తాం

రాష్ట్రంలోని ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రతి నెలా 1వ తారీఖున జీతాలు, పెన్షన్లు చెల్లిస్తాం. వీరికి రావాల్సిన బకాయిలు కూడా చెల్లించే ఏర్పాటు చేస్తాం. పెన్షనర్స్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు దిశగా చర్యలు

తక్కువ జీతాలు పొందే అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు, కన్సాలిడేటెడ్‌ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపు

వలంటీర్ల గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంపు

ఎక్స్‌సర్వీ్‌సమెన్‌ సంక్షేమానికి

ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ఎక్స్‌సర్వీ్‌సమెన్‌ సంక్షేమానికి కృషి చేస్తాం. వారి సమస్యలను పరిష్కరిస్తాం

యువత సంక్షేమం

మెగా డీఎస్సీ, ప్రతి సంవత్సరం జాబ్‌ క్యాలెండర్‌

ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి, ఉద్యోగ కల్పనకు ప్రత్యేక ఎంప్లాయిమెంట్‌ జోన్‌ల ఏర్పాటు

అత్యధిక ఉద్యోగాల కల్పన చేసే ఎంఎ్‌సఎంఈ సెక్టార్‌కు ప్రోత్సాహకాలు

మూతపడిన ప్రతి నైపుణ్య శిక్షణా కేంద్రం పున:ప్రారంభం- విస్తరణ

పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగాలు కల్పిస్తాం

క్రీడలు: ప్రపంచస్థాయి క్రీడా సదుపాయాలు అభివృద్ధి పరిచి రాష్ట్ర యువతను అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతాం

భవిష్యత్‌లో జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలకు రాష్ట్రాన్ని వేదికగా మారుస్తాం

డిజిటల్‌ లైబ్రరీలు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరీక్షలకు ప్రిపేర్‌ కావడం కోసం డిజిటల్‌ లైబ్రరీల స్థాపన

ఎన్‌డీఏ ప్రభుత్వం తెచ్చిన 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను అమలు చేస్తాం. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఆర్థిక సర్వే చేసి రిజర్వేషన్లు అమలు చేస్తాం

మెగా డీఎస్సీ, ప్రతి సంవత్సరం జాబ్‌ క్యాలెండర్‌

ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి, ఉద్యోగ కల్పనకు ప్రత్యేక ఎంప్లాయిమెంట్‌ జోన్‌ల ఏర్పాటు

అత్యధిక ఉద్యోగాల కల్పన చేసే ఎంఎ్‌సఎంఈ సెక్టార్‌కు ప్రోత్సాహకాలు

మూతపడిన ప్రతి నైపుణ్య శిక్షణా కేంద్రం పున:ప్రారంభం- విస్తరణ

పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగాలు కల్పిస్తాం

క్రీడలు: ప్రపంచస్థాయి క్రీడా సదుపాయాలు అభివృద్ధి పరిచి రాష్ట్ర యువతను అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతాం

భవిష్యత్‌లో జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలకు రాష్ట్రాన్ని వేదికగా మారుస్తాం

డిజిటల్‌ లైబ్రరీలు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరీక్షలకు ప్రిపేర్‌ కావడం కోసం డిజిటల్‌ లైబ్రరీల స్థాపన

ఎన్‌డీఏ ప్రభుత్వం తెచ్చిన 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను అమలు చేస్తాం. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఆర్థిక సర్వే చేసి రిజర్వేషన్లు అమలు చేస్తాం


వ్యవసాయం

9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ సరఫరా

రాయితీతో సోలార్‌ పంప్‌సెట్లు- మిగిలిన విద్యుత్‌ ప్రభుత్వం కొనుగోలు

సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు

ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు

కౌలు రైతులకు గుర్తింపు కార్డులు-పంటల బీమా వర్తింపు

రైతు కూలీలకు కార్పొరేషన్‌ స్థాపించి రాయితీలు, సంక్షేమ పథకాల అమలు

ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో వెయ్యి ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేపట్టి, ఆర్థిక, సాగు, మార్కెటింగ్‌ అంశాల్లో తోడ్పాటు

ప్రభుత్వ రంగంలో గిడ్డంగులు, కోల్డ్‌ స్టోరేజి యూనిట్ల ఆధునీకరణ, యూనిట్ల ఏర్పాటు

దళారుల దోపిడీని అరికట్టడానికి ఏపీయంసీ యాక్ట్‌ పటిష్ఠంగా అమలు

డ్రిప్‌ ఇరిగేషన్‌కు 90 శాతం సబ్సిడీ

సెరికల్చర్‌ను ప్రోత్సహించి రైతులను ఆదుకుంటాం. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు చేసి.. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తాం

పాడి రైతులు

పశువుల కొనుగోళ్లు, దాణా, మందుల కొనుగోళ్లపై సబ్సిడీలు, ఇన్సూరెన్స్‌ సౌకర్యం-గోకులాల ఏర్పాటు, మేత కోసం భూముల కేటాయింపు

గోపాల మిత్రల పునర్నియామకం దిశగా చర్యలు

ఫుడ్‌ ప్రాసెసింగ్‌

ఫ వ్యవసాయ ఉత్పత్తుల ఆధారిత పరిశ్రమల స్థాపనకు పెద్దఎత్తున ప్రోత్సాహకాలిచ్చి రైతుల ఆదాయం పెంచడంతోపాటు స్వయం ఉపాధి, ఉపాధి కల్పనకు ప్రోత్సాహం

అగ్రిగోల్డ్‌ బాధితులు

అగ్రిగోల్డ్‌ ఆస్తులు అమ్మి బాధితులకు అందేలా చర్యలు తీసుకుంటాం

పంచాయతీరాజ్‌ డిక్లరేషన్‌

ఆర్థిక సంఘం నిధులను నేరుగా పంచాయతీలకు అందిస్తాం

పంచాయతీరాజ్‌ వ్యవస్థకు పూర్వవైభవం కల్పిస్తాం - స్థానిక పాలనకు ఊతమిస్తాం

పంచాయతీరాజ్‌ ప్రాజెక్టు ప్రతిపాదనల కోసం బడ్జెట్‌లో 5 శాతం కేటాయిస్తాం. ఐదేళ్లలో 10 శాతం వరకూ పెంచుతాం

సర్పంచ్‌ల నుంచి జెడ్పీ చైర్మన్‌ల వరకూ ప్రస్తుత గౌరవ వేతనాన్ని పెంచుతాం

Updated Date - May 01 , 2024 | 05:37 AM

Advertising
Advertising