ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

చంద్రబాబు కాన్వాయ్‌ వెంట మహిళ పరుగులు

ABN, Publish Date - Jun 12 , 2024 | 03:04 AM

చంద్రబాబును చూడాలి.... ఆయన కాళ్లు మొక్కాలి అంటూ ఒక మహిళ చంద్రబాబు కాన్వాయ్‌ వెంట పరుగులు తీసింది.

విజయవాడ, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): చంద్రబాబును చూడాలి.... ఆయన కాళ్లు మొక్కాలి అంటూ ఒక మహిళ చంద్రబాబు కాన్వాయ్‌ వెంట పరుగులు తీసింది. వెంటనే కాన్వాయ్‌ని ఆపించిన చంద్రబాబు ఆ మహిళతో మాట్లాడారు. ఈ సంఘటన మంగళవారం విజయవాడలో చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన నందిని అనే మహిళ చంద్రబాబును కలవడం కోసం ఏ కన్వెన్షన్‌ వద్దకు వచ్చి, ఓ పక్కన నిలబడింది. సమావేశం పూర్తయిన తర్వాత చంద్రబాబు కాన్వాయ్‌ ఏ కన్వెన్షన్‌ ప్రాంగణం నుంచి నెమ్మదిగా రోడ్డు మీదకు వచ్చింది. అక్కడి నుంచి కాస్తంత వేగం పెరిగింది. వాహనంలో ఉన్న చంద్రబాబును చూసిన నందిని ఆయనను కలవడం కోసం కాన్వాయ్‌ వెంట పరుగులు తీసింది. దీన్ని గమనించిన చంద్రబాబు వెంటనే వాహనాన్ని నిలుపుదల చేయించారు. ఆయన నందినీని ఆత్మీయంగా పలకరించారు. ‘‘మా కష్టం ఫలించింది. మీరు సీఎం అయ్యారు సార్‌. ఒక్కసారి మీ కాళ్లు మొక్కుతాను’’ అని చెప్పింది. వెంటనే చంద్రబాబు వద్దని వారించారు. అప్యాయంగా పలకరించి ఆమెతో ఫొటో దిగారు. జ్వరం ఉన్నా చూడడానికి మదనపల్లె నుంచి వచ్చానని చెప్పింది. ఆసుపత్రిలో చూపించుకోవాలని, అవసరమైన సాయం చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.

Updated Date - Jun 12 , 2024 | 03:05 AM

Advertising
Advertising