న్యాయవాదులకు ఇళ్లస్థలాలు కేటాయించండి
ABN, Publish Date - Oct 22 , 2024 | 03:13 AM
రాష్ట్రంలోని అడ్వొకేట్ల సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ అడ్వొకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.చిదంబరం నేతృత్వంలోని బృందం ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేసింది.
సీఎం చంద్రబాబుకు అడ్వొకేట్స్ అసోసియేషన్ వినతి
అమరావతి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అడ్వొకేట్ల సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ అడ్వొకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.చిదంబరం నేతృత్వంలోని బృందం ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేసింది. అడ్వొకేట్ అసోసియేషన్ సభ్యత్వం ఉన్న న్యాయవాదులకు ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు వంద ఎకరాలు కేటాయించాలని, లేదా అపార్ట్మెంట్ విధానంలో ఇళ్లు నిర్మాణం కోసం 50 ఎకరాలు కేటాయించాలని సీఎంను కోరింది. న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.10 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని విన్నవించింది. న్యాయవాదులలో వృత్తి నైపుణ్యం పెంచేందుకు అడ్వొకేట్ అకాడమీ ఏర్పాటుకు స్థలం కేటాయించడంతో పాటు నిర్మాణం కోసం అవసరమైన నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేసింది.
Updated Date - Oct 22 , 2024 | 03:14 AM