మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

చీరాలలో ఆమంచి.. పి.గన్నవరంలో చిట్టిబాబు

ABN, Publish Date - Apr 23 , 2024 | 05:05 AM

వైసీపీని వీడి కాంగ్రె్‌సలో చేరిన చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌, పి.గన్నవరం(ఎస్సీ) ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం అవే అసెంబ్లీ టికెట్లు ఖరారు చేసింది.

చీరాలలో ఆమంచి.. పి.గన్నవరంలో చిట్టిబాబు

సుంకర పద్మశ్రీకి విజయవాడ తూర్పు

38 మందితో కాంగ్రెస్‌ అభ్యర్థుల మలి జాబితా

10 అసెంబ్లీ సీట్లలో మార్పులు

న్యూఢిల్లీ/అమరావతి, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): వైసీపీని వీడి కాంగ్రె్‌సలో చేరిన చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌, పి.గన్నవరం(ఎస్సీ) ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం అవే అసెంబ్లీ టికెట్లు ఖరారు చేసింది. పార్టీ సీనియర్‌ నాయకురాలు సుంకర పద్మశ్రీని విజయవాడ తూర్పు అభ్యర్థిగా, రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు లక్కరాజు రామారావును విశాఖ ఉత్తరం అభ్యర్థిగా ప్రకటించింది. ఆంధప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే మరో 38 మంది అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సోమవారం ఢిల్లీలో విడుదల చేశారు. మొదటి జాబితాలో 114, రెండో జాబితాలో 12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. వాటిలో 10 సీట్లలో అభ్యర్థులను మార్చారు. దీంతో ఇప్పటివరకూ ఏపీలో 154 మంది అభ్యర్థులను కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించినట్లయింది.

Updated Date - Apr 23 , 2024 | 05:05 AM

Advertising
Advertising