ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

accident: రోడ్డు ప్రమాదంలో బలిజపల్లివాసి మృతి

ABN, Publish Date - May 21 , 2024 | 12:20 AM

తిరుపతి నగరంలోని లీలామహల్‌ సర్కిల్‌ వద్ద సోమవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు.

తిరుపతి(నేరవిభాగం), మే 20: తిరుపతి నగరంలోని లీలామహల్‌ సర్కిల్‌ వద్ద సోమవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. అలిపిరి ఎస్‌ఐ రాజశేఖర్‌ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీసత్యసాయి జిల్లా ఓబుళదేవర చెరువు మండలం బలిజపల్లికి చెందిన కొట్టం నరసింహయ్య అనారోగ్యంతో రెండు రోజుల క్రితం తిరుపతి స్విమ్స్‌ ఆస్పత్రికి వచ్చాడు. గ్యాస్ర్టో ఎంట్రాలజీ విభాగంలో వైద్యం చేయించుకున్నాడు.


అనంతరం తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నాడు. సోమవారం సాయంత్రం కిందకు వచ్చి లీలామహల్‌ వద్ద బస్సు దిగి రోడ్డు దాటుతుండగా బ స్టాండు నుంచి నంద్యాలకు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొం ది. ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అలిపిరి పోలీసులు బస్సును సీజ్‌ చేసి, మృతదేహాన్ని రుయా ఆస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ కేసు నమోదు చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై మృతుడి బంధువులకు సమాచారం అందించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - May 21 , 2024 | 12:20 AM

Advertising
Advertising