ఆర్టీసీ బస్టాండులోని దుకాణాలపై దాడులు
ABN, Publish Date - Jun 08 , 2024 | 12:15 AM
స్థానిక ఆర్టీసీ బస్టాండులోని దుకాణాలను తూనికలు, కొలతల శాఖాధి కారులు శుక్రవారం తనిఖీ లు నిర్వహించారు. ఈ దుకాణాల్లో కూల్డ్రింక్స్, తినుబండారాలను అధిక ధరలకు అమ్ముతున్నారని ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన ‘అంతా..మోసం’ కథనానికి అధికారులు స్పందించి ఈ తనిఖీలు చేపట్టారు.
అనంతపురం ప్రెస్క్లబ్, జూన 7: స్థానిక ఆర్టీసీ బస్టాండులోని దుకాణాలను తూనికలు, కొలతల శాఖాధి కారులు శుక్రవారం తనిఖీ లు నిర్వహించారు. ఈ దుకాణాల్లో కూల్డ్రింక్స్, తినుబండారాలను అధిక ధరలకు అమ్ముతున్నారని ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన ‘అంతా..మోసం’ కథనానికి అధికారులు స్పందించి ఈ తనిఖీలు చేపట్టారు. తూనికలు, కొలతలశాఖ అసిస్టెంట్ కంట్రోలర్ సుధాకర్, ఇన్సపెక్టర్ మహమ్మద్ గౌస్ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహిం చారు.
ఈ దుకాణాలలో కూల్డ్రింక్స్, బిస్కెట్ ప్యాకెట్లు, తినుబండారాలను అధిక ధరలకు విక్రయిస్తుండటాన్ని గుర్తించి షాపు యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మార్పీ ధరలకంటే అదనంగా రూ. 5 లు విక్రయిస్తున్న నాలుగు దుకాణాలపై కేసులు నమోదు చేశారు. అనంతరం బస్టాండులోని దుకాణాదారులకు తూనికలు, కొలతల శాఖ చట్టాలపై అవగాహాన కల్పించారు. ఈ తనిఖీలలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పి. శ్రీనివాసులు, టెక్నికల్ అసిస్టెంట్లు అక్రమ్, మహమ్మద్, సిబ్బంది విశ్వనాథ్ పాల్గొన్నారు.
Updated Date - Jun 08 , 2024 | 12:15 AM