ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CELEBRATIONS : ‘బాబు వచ్చాడు... వర్షాలొచ్చాయ్‌...’

ABN, Publish Date - Jun 06 , 2024 | 12:21 AM

చంద్రబాబు వచ్చాడు, రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు వస్తున్నాయని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడంతో బుధవారం పట్టణం లోని పలు ప్రాంతాల్లో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నా రు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... ఐదేళ్ల రాక్షస పాలన అంతమైందని ఇక ముందున్నది రామరాజ్యమన్నారు.

Councilor Manjula and others cutting the cake in Srikanthapuram

హిందూపురం అర్బన, జూన 5: చంద్రబాబు వచ్చాడు, రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు వస్తున్నాయని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడంతో బుధవారం పట్టణం లోని పలు ప్రాంతాల్లో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నా రు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... ఐదేళ్ల రాక్షస పాలన అంతమైందని ఇక ముందున్నది రామరాజ్యమన్నారు. వైసీపీ ప్రభు త్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఓటు ద్వారా వ్యక్తపరిచారన్నారు. శ్రీకంఠపురంలో 9వ వార్డు కౌన్సిలర్‌ మంజుల దుర్గా నవీన ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు. లక్ష్మీపురంలో శ్రీనివాసులు తదితరుల ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

పెనుకొండ రూరల్‌: సార్వత్రిక ఎన్నికలలో కూటమి అభ్యర్థి సవిత అత్యధిక మెజార్టీతో గెలువడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఆమె బుధవారం మండలపరిధిలోని రాంపురంలో ఉన్న తన తండ్రి ఎస్‌ రామచంద్రారెడ్డి సమాధి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆమెను ఘనంగా సత్కరించారు.

Updated Date - Jun 06 , 2024 | 12:21 AM

Advertising
Advertising