ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

JASHUVA: జాషువా వర్ధంతిని జయప్రదం చేయండి

ABN, Publish Date - Jul 17 , 2024 | 11:52 PM

జాషువా సాహిత్య పీఠం ఆధ్వర్యంలో 24వ తేదీన నిర్వహించనున్న జాషువా 53 వర్ధంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పీఠం ప్రధాన కార్యదర్శి నాగలింగయ్య పిలుపునిచ్చారు. బుధవారం విశాలాంధ్ర బుక్‌హౌ్‌సలో జాషువా వర్దంతి బ్రోచర్లను ఆవిష్కరించారు.

Sahitya Peetha members unveiling brochures

అనంతపురం కల్చరల్‌, జూలై 17: జాషువా సాహిత్య పీఠం ఆధ్వర్యంలో 24వ తేదీన నిర్వహించనున్న జాషువా 53 వర్ధంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పీఠం ప్రధాన కార్యదర్శి నాగలింగయ్య పిలుపునిచ్చారు. బుధవారం విశాలాంధ్ర బుక్‌హౌ్‌సలో జాషువా వర్దంతి బ్రోచర్లను ఆవిష్కరించారు. నాగలింగయ్య మాట్లాడుతూ... 24న ఉదయం 9 గంటలకు ఆర్ట్స్‌ కళాశాల ప్రధాన గేటు ఎదురుగా ఉన్న గుర్రం జాషువా విగ్రహానికి నివాళి అర్పించనున్నట్లు తెలిపారు. 11 గంటలకు ఆర్ట్స్‌ కళాశాలలోని కామర్స్‌ సెమినార్‌ హాల్‌లో జాషువా సాహిత్యంపై సాహితీ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. జాషువా సాహిత్యంపై విద్యార్థులకు వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించి, పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. ఎస్కేయూ తెలుగు శాఖ అకడమిక్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ నానీల నాగేంద్ర, పూజారి ఈరన్న, విశాలాంధ్ర బుక్‌హౌస్‌ సిబ్బంది పాటిల్‌ హరీష్‌, చెట్ల ప్రవీణ్‌, సీఎన శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - Jul 17 , 2024 | 11:52 PM

Advertising
Advertising
<