ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

చంద్రబాబుతోనే రాషా్ట్రభివృద్ధి

ABN, Publish Date - Mar 27 , 2024 | 12:19 AM

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ సునీల్‌కుమార్‌ పేర్కొన్నారు.

ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్‌కుమార్‌

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్‌కుమార్‌

గుడిబండ, మార్చి 26 : రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ సునీల్‌కుమార్‌ పేర్కొన్నారు. ఆయన మంగళవారం మండలంలోని శంకరగల్లు గ్రామంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అన్నివిధాలా అభివృద్ధి చెందు తుందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ప్రజా సంక్షేమంతో పాటు రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందన్నారు. వైసీపీ పాలనతో రాష్ట్రం అన్నివిధాలా వెనుకబడిపోయిందని విమర్శించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని ఆదరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. అనంతరం రాళ్లపల్లి, శంకరగల్లు పంచాయతీల్లో పర్యటించారు. రాళ్లపల్లి అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శంకరగల్లు రామాంజి తదితరులు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. వారికి ఆయన పార్టీ కండువావేసి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న, రాష్ట్ర వక్కలిగ సాధికార కన్వీనర్‌ వీఎం పాండురంగప్ప, మాజీ ఎంపీపీ, నాయకులు ఎస్‌హెచరాయుడు, క్రిష్ణమూర్తి, హనుమంతరాయప్ప, మందలపల్లి మారేగౌడ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2024 | 12:19 AM

Advertising
Advertising