COLLECTOR: చారిత్రక సంపదను పరిరక్షించుకోవాలి
ABN, Publish Date - Aug 11 , 2024 | 11:42 PM
జిల్లాలోని చారిత్రక సంపదను పరిరక్షించుకోవాలని కలెక్టర్ వినోద్కుమార్ అన్నారు. ఆదిమూర్తినగర్లోని పురావస్తు ప్రదర్శనశాలను ఆదివారం కలెక్టర్ సందర్శించారు.
అనంతపురం కల్చరల్, ఆగస్టు 11: జిల్లాలోని చారిత్రక సంపదను పరిరక్షించుకోవాలని కలెక్టర్ వినోద్కుమార్ అన్నారు. ఆదిమూర్తినగర్లోని పురావస్తు ప్రదర్శనశాలను ఆదివారం కలెక్టర్ సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతి గ్రామ, మండల, మున్సిపల్ ఏరియాలు, పొలాలు, నదీ ప్రదేశాల్లోని చారిత్రక ప్రాధాన్యం కలిగిన రాతి విగ్రహాలు, పనిముట్లు, వస్తువులను గుర్తిస్తే పురావస్తుశాఖకు సమాచారం అందజేసి, స్వచ్ఛందంగా అప్పగించేందుకు సహకరించాలన్నారు. భారత పౌరులుగా బాధ్యతతో ప్రాచీన సంపద, ప్రాచీన కలల గురించి భావితరాలకు అందజేయాల్సిన అవసరముందన్నారు. కార్యక్రమంలో పురావస్తుశాఖ ఏడీ రజిత, అసిస్టెంట్ మహేంద్రనాయుడు, టైపిస్ట్ గంగా నరే ష్బాబు పాల్గొన్నారు.
Updated Date - Aug 11 , 2024 | 11:43 PM