divotional: పుష్పమండపంపై ఊరేగిన లక్ష్మీచెన్నకేశవుడు
ABN, Publish Date - May 20 , 2024 | 12:23 AM
చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల ఐదోరోజు ఆదివారం స్వామివారు పుష్పమండపంపై విహరించారు. శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీచెన్నకేశవ స్వామి ఉత్సవ విగ్రహాలను ఉదయం ప్రత్యేకంగా అలంకరించి, పుష్పమండపంపై కొలువుదీర్చారు.
ధర్మవరం, మే 19: చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల ఐదోరోజు ఆదివారం స్వామివారు పుష్పమండపంపై విహరించారు. శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీచెన్నకేశవ స్వామి ఉత్సవ విగ్రహాలను ఉదయం ప్రత్యేకంగా అలంకరించి, పుష్పమండపంపై కొలువుదీర్చారు.
పట్టణ వీధుల్లో ఊరేగించారు. రాత్రి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో స్వామివారి కల్యాణోత్సవాన్ని నయనమనోహరంగా నిర్వహించారు. అన్నమయ్య సేవామండలి ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తనలను ఆలపించారు. సోమవారం ఉదయం శేషవాహనం, సాయంత్రం గజవాహనాలపై చెన్నకేశవుడు విహరించనున్నట్లు ఆలయ ఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - May 20 , 2024 | 12:23 AM