ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జాతీయ ఫుట్‌బాల్‌ విజేత మణిపూర్‌

ABN, Publish Date - Aug 20 , 2024 | 11:57 PM

జాతీయ జూనియర్‌ బాలికల ఫుట్‌బాల్‌ విజేతగా మణిపూర్‌ జట్టు నిలిచింది. 20 రోజులుగా స్థానిక అనంత క్రీడాగ్రామం ఆర్డీటీలో నిర్వహిస్తున్న జాతీయ జూనియర్‌ బాలికల ఫుట్‌బాల్‌ పోటీలు మంగళవారం ముగిశాయి.

Manipur team won with the trophy

అనంతపురం క్లాక్‌టవర్‌, ఆగస్టు 20: జాతీయ జూనియర్‌ బాలికల ఫుట్‌బాల్‌ విజేతగా మణిపూర్‌ జట్టు నిలిచింది. 20 రోజులుగా స్థానిక అనంత క్రీడాగ్రామం ఆర్డీటీలో నిర్వహిస్తున్న జాతీయ జూనియర్‌ బాలికల ఫుట్‌బాల్‌ పోటీలు మంగళవారం ముగిశాయి. ఫైనల్‌ పోరులో జార్ఖండ్‌, మణిపూర్‌ జట్లు తలపడ్డాయి. ఉత్కంఠగా సాగిన పోరులో జార్ఖండ్‌పై 2 గోల్స్‌ తేడాతో మణిపూర్‌ విజయం సాధించి టోర్నీ విజేతగా నిలిచింది. పెద్ద రాష్ట్రాలు పోటీలో లేకపోవడం గమనార్హం. ఆర్డీటీ మహిళా సాధికారత డైరెక్టర్‌ విశాల ఫెర్రర్‌ చేతుల మీదుగా విజేత జట్లకు బహుమతులు ప్రదానం చేశారు. ఆర్డీటీ స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ సాయికృష్ణ, ఏపీ ఫుట్‌బాల్‌ అసోసియేషన ఉపాధ్యక్షులు ముని శ్రీనివాస్‌, వేణుగోపాల్‌, కార్యదర్శి డేనియల్‌ ప్రదీప్‌, జిల్లా కార్యదర్శి మల్లేష్‌, కడప అధ్యక్షుడు సుధీర్‌, క్రీడాకారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 20 , 2024 | 11:57 PM

Advertising
Advertising
<