Anjaneyaswami : పవనపుత్రా! పాహిమాం
ABN, Publish Date - Aug 14 , 2024 | 12:41 AM
జిల్లాలో ప్రసిద్ధిగాంచిన కసాపురం, నేమకల్లు, మురడి ఆంజనేయస్వామి ఆలయాల్లో మంగళవారం విశేష పూజలు జరిగాయి. ప్రతి ఏటా శ్రావణమాసంలో శని లేదా మంగళవారం ఒకే రోజు ఈ మూడు ఆలయాలను దర్శించుకోవడం భక్తులకు పరిపాటి. ఈ క్రమంలో ఉదయం నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున సుప్రభాతసేవ, పంచామృతాభిషేకం, నిర్మల్య విసర్జన, విష్ణు పారాయణం, అష్టోత్తర పూజలు ..
ఆంజనేయస్వామి ఆలయాల్లో విశేష పూజలు
గుంతకల్లు/బొమ్మనహాళ్/డి.హీరేహాళ్, ఆగస్టు 13: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన కసాపురం, నేమకల్లు, మురడి ఆంజనేయస్వామి ఆలయాల్లో మంగళవారం విశేష పూజలు జరిగాయి. ప్రతి ఏటా శ్రావణమాసంలో శని లేదా మంగళవారం ఒకే రోజు ఈ మూడు ఆలయాలను దర్శించుకోవడం భక్తులకు పరిపాటి. ఈ క్రమంలో ఉదయం నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున సుప్రభాతసేవ, పంచామృతాభిషేకం, నిర్మల్య విసర్జన, విష్ణు పారాయణం, అష్టోత్తర పూజలు
నిర్వహించారు. స్వామివారి విగ్రహాన్ని విశేష పుష్పాలు ఆభరణాలతో అలంకరించి, భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు ఆలయంలో హనుమాన చాలీసా, సుందరకాండ పారాయణాలు చేశారు. కసాపురంలో రాత్రికి సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వాములవారి ఉత్సవ విగ్రహాలను వెండి రథంపై ఆశీనులను గావించి ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు స్వామివారి దర్శనార్థం తరలివచ్చారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Aug 14 , 2024 | 12:41 AM