WATER WORKERS: బిచ్చమెత్తుకుంటూ తాగునీటి కార్మికుల నిరసన
ABN, Publish Date - Aug 28 , 2024 | 11:37 PM
సమస్యలు పరిష్కారించాలని సత్యసాయి తాగునీటి కార్మికుల గతవారం రోజుల నుంచి నిరసనలు కొనసాగిస్తున్నారు. కల్లూరు పంపుహౌస్ వద్ద బుధవారం సత్యసాయి బాబా చిత్రపటాన్ని ముందు పెట్టుకుని బిచ్చమెత్తుకుంటూ వినూత్న నిరసన తెలిపారు.
గార్లదిన్నె, ఆగస్టు 28: సమస్యలు పరిష్కారించాలని సత్యసాయి తాగునీటి కార్మికుల గతవారం రోజుల నుంచి నిరసనలు కొనసాగిస్తున్నారు. కల్లూరు పంపుహౌస్ వద్ద బుధవారం సత్యసాయి బాబా చిత్రపటాన్ని ముందు పెట్టుకుని బిచ్చమెత్తుకుంటూ వినూత్న నిరసన తెలిపారు. తాగునీటి పథకం ద్వారా లక్షలాది మంది ప్రజలకు తాగునీరు అందించడంతో పాటు వందలాది మంది నిరుద్యోగులు ఉపాధి పొందుతున్నారని కార్మికులు తెలిపారు. 6 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదన్నారు. సమస్యలను పరిష్కారించాలని వేడుకున్నారు. కార్మికులు నాగభూషణం, మల్లరాయుడు, శ్రీనివాసులు, నాగేశ్వరరావు, సాంబశివ, జనార్థనరెడ్డి, శంకర్, బాషా పాల్గొన్నారు.
నార్పల: సత్యసాయి కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలు మంజూరు చేయాలని బీ పప్పూరు పంప్ హౌస్ వద్ద చేపట్టిన సమ్మె బుధవారం ఏడో రోజుకుచేరింది. పంప్ హౌస్ వద్ద కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. కార్మికులు నాగభూషన, అంకన్న, పుల్లనాయుడు, శరతబాబు, శ్రీరాములు, చంద్రమోహన, ధనుంజయ పాల్గొన్నారు.
Updated Date - Aug 28 , 2024 | 11:37 PM