investigated సర్పంచ అవినీతిపై విచారణ చేపట్టాలి
ABN, Publish Date - Jul 27 , 2024 | 12:04 AM
ఉరవకొండ మేజర్ పం చాయతీ సర్పంచ లలితమ్మ అవినీతి అక్రమాలపై విచార ణ చేపట్టాలని టీడీ పీ మద్దతు వార్డు సభ్యులు కోరారు. ఈ మేరకు డీపీఓ ప్రభాకర్ రావును శుక్రవారం అనంతపురంలో కలిసి వినతిపత్రం అందజేశారు.
ఉరవకొండ,జూలై 26: ఉరవకొండ మేజర్ పం చాయతీ సర్పంచ లలితమ్మ అవినీతి అక్రమాలపై విచార ణ చేపట్టాలని టీడీ పీ మద్దతు వార్డు సభ్యులు కోరారు. ఈ మేరకు డీపీఓ ప్రభాకర్ రావును శుక్రవారం అనంతపురంలో కలిసి వినతిపత్రం అందజేశారు.
పలువురు మాట్లాడుతూ సర్పంచ చేయని పనులకు కూడా బిల్లులు పెట్టుకుని డ్రా చేశారన్నారు. హైమాస్ట్ లైట్ల ఏర్పాటులో రూ.5లక్షల దాకా నిధులను దుర్వినియోగం చేశారని, ఉరవకొండ రథోత్సవానికి సంబంధించిన బిల్లులో కూడా అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. వీటిపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు రామాంజనేయులు, నిరంజనగౌడ్, ప్రభాకర్, వాసుదేవుడు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం
Updated Date - Jul 27 , 2024 | 12:04 AM