ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MP: సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

ABN, Publish Date - Jul 20 , 2024 | 11:51 PM

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు కోరారు.

Village and ward secretariat employees explaining problems to MP Ambika

అనంతపురం అర్బన, జూలై 20: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు కోరారు. శనివారం నగరశివారులోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఆయన్ను ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు గోపీ కృష్ణ, శ్రీరాములునాయక్‌, సాంబశివమ్మ, నాగరాజు, ఓబిరెడ్డి, ఈశ్వరయ్య, నాగార్జున, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు లక్ష్మీనారాయణ, వరప్రసాద్‌ కలిసి పలు సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారు. సచివాలయ ఉద్యోగులకు ఎలాంటి సర్వీస్‌ నిబంధనలు, ప్రమోషన చానల్స్‌, జాబ్‌ చార్ట్‌ లేకుండా ఐదేళ్లల్లో అనేక రకాల పనులు చేయించి తీవ్ర పని ఒత్తిడికి గురిచేశారన్నారు. ఈనెల 28న జిల్లా కేంద్రంలో జరిగే సచివాలయ ఉద్యోగుల సదస్సుకు హాజరుకావాలని కోరారు. ఇందుకు ఎంపీ స్పందిస్తూ సచివాలయ ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నాయకులు శివశంకర్‌, మహే్‌షనాయక్‌, హనుమంతు, భగీరథరెడ్డి, రామాంజనేయులు, విజయ్‌, మణిదీప్‌, సాయి తేజ, రాఘవేంద్ర పాల్గొన్నారు.

Updated Date - Jul 20 , 2024 | 11:51 PM

Advertising
Advertising
<