Srivari kalayanam : శ్రీనివాస కల్యాణం
ABN, Publish Date - Aug 08 , 2024 | 12:09 AM
అనంతపురం నగరంలోని పాతూరు వాసవీ కన్యకాపరమేశ్వరి కల్యాణ మండపంలో కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం బుధవారం కన్నుల పండువగా సాగింది. వాసవీ మహిళా మండలి ఆధ్వర్యంలో శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులకు అష్టోత్తర కలశాభిషేకం, తోమాల సేవ నిర్వహించారు. అనంతరం అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ సేవ ..
పులకించిన భక్తజనం
అనంతపురం నగరంలోని పాతూరు వాసవీ కన్యకాపరమేశ్వరి కల్యాణ మండపంలో కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం బుధవారం కన్నుల పండువగా సాగింది. వాసవీ మహిళా మండలి ఆధ్వర్యంలో శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులకు అష్టోత్తర కలశాభిషేకం, తోమాల సేవ నిర్వహించారు. అనంతరం అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ సేవ
నిర్వహించారు. తదనంతరం వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ స్వామివార్ల కల్యాణోత్సవం జరిపించారు. గోవింద న్మాస్మరణలతో భక్తులు పులకించిపోయారు. సాయంత్రం డోలోత్సవం, సహస్రదీపార్చనతో వేడుకను ముగించారు. పాతూరు ఆర్యవైశ్యసంఘం అధ్యక్షుడు పిన్ని నాగరత్నం, కొత్తూరు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గోపామచ్చా నరసింహులు, వాసవీ మహిళామండలి అధ్యక్షురాలు చల్లా స్వర్ణలత, సభ్యులు పాల్గొన్నారు. -అనంతపురం కల్చరల్
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Aug 08 , 2024 | 12:10 AM