విద్యార్థులు మొక్కలు నాటాలి’
ABN, Publish Date - Jul 30 , 2024 | 11:30 PM
మొక్కలు నాటడం ప్రతి విద్యార్థి జీవితంలో అలవర్చుకోవాలని సూరప్పనేని విద్యాసాగర్ ఫౌండేషన వ్యవస్థాపకుడు విద్యాసాగర్ సూచించారు. మంగళశారం నాగలమడకలోని చోళరాయచెరువు ప్రాంతంలో గురుకుల పాఠశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
పావగడ, జూలై 30: మొక్కలు నాటడం ప్రతి విద్యార్థి జీవితంలో అలవర్చుకోవాలని సూరప్పనేని విద్యాసాగర్ ఫౌండేషన వ్యవస్థాపకుడు విద్యాసాగర్ సూచించారు. మంగళశారం నాగలమడకలోని చోళరాయచెరువు ప్రాంతంలో గురుకుల పాఠశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి ద్వారా మనం ఎన్నోఉపయోగాలు పొందుతున్నామని, అందుకే ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. చిన్నతనం నుంచే మొక్కలు నాటడం, సీడ్బాల్స్ విసరడం అలవర్చుకోవాలని అటవీశాఖ అధికారి శివప్ప తెలిపారు. ఈ సందర్భంగా గురుకుల విద్యాసంస్థ కార్యదర్శి ఎనసీ నాగభూషణ్, సెమివృక్షసమితి అధ్యక్షులు లోకేష్, పీడీఓ హనుమంతరాయప్ప, విద్యార్థులు పాల్గొన్నారు.
Updated Date - Jul 30 , 2024 | 11:30 PM