Temple: వైభవంగా ధ్వజారోహణం
ABN, Publish Date - May 22 , 2024 | 12:14 AM
మండలంలోని పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహోత్సవాల లో భాగంగా మంగళవారం ధ్వజారోహణ కార్య క్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భం గా ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ధ్వజరోహణ కార్యక్ర మాన్ని ఆలయ ప్రధాన అర్చకులు ద్వారకానాథా చార్యులు శాస్రోక్తంగా నిర్వహిచారు. రాత్రి ప్రాకా రోత్సవాన్ని నిర్వహించారు.
ఉరవకొండ, మే 21: మండలంలోని పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహోత్సవాల లో భాగంగా మంగళవారం ధ్వజారోహణ కార్య క్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భం గా ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ధ్వజరోహణ కార్యక్ర మాన్ని ఆలయ ప్రధాన అర్చకులు ద్వారకానాథా చార్యులు శాస్రోక్తంగా నిర్వహిచారు. రాత్రి ప్రాకా రోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాతలుగా పెద్దముష్టూరుకు చెందిన గుండ్రాయప్ప కుటుంబసభ్యులు వ్యవహరించారు. కార్యక్రమంలో ఈవో విజయ్ కుమార్, అర్చకులు ఆలయ సిబ్బంది మారుతి, దీపక్, తదితరులు పాల్గొన్నారు.
నేడు నృసింహజయంతి
మండలంలోని పెన్నహోబిలం లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో బుధవారం స్వామి వారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అలాగే ఉత్సవాల్లో భాగంగా సింహవాహనోత్సవం, చంద్రప్రభ వాహనోత్సవాలు నిర్వహించనున్నారు.
పాత రథానికి ట్రయల్ రన
లక్ష్మీనరసింహస్వామి బ్రహోత్సవాలలో భాగంగా రథోత్సవ నిర్వహణకోసం పాతరథానికి మంగళ వారం ట్రయల్ రన నిర్వహించారు. గత ఏడాది రథం కూలిపోయి దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఆ రథానికి తాత్కలిక మరమ్మతులు చేశారు. దీంతో ఈ నెల 28న జరిగే రథోత్సవం నాటికి రథం సిద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా ట్రయల్ రన చేపట్టారు. పాత రథానికి అర్చకులు, ఈవో పూజలు నిర్వహించి రథాన్ని కొంత దూరం లాగారు. యథాస్థానికి చేర్చే సమయంలో రథం కదలక పోవడంతో ట్రాక్టర్లకు తాళ్లుకట్టి లాగారు. ఈ రథానికి సంబంధించి ఆర్ అండ్ బీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతులు ఇవ్వాల్సి ఉంది.
Updated Date - May 22 , 2024 | 12:14 AM