హత్యాచార దోషులను కఠినంగా శిక్షించాలి
ABN, Publish Date - Aug 26 , 2024 | 12:34 AM
కోల్కతాలో మహిళా డాక్టర్పై హత్యాచారానికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని పౌర చైతన్య వేదిక జిల్లా కన్వీనర్ రాఘవేంద్ర డిమాండ్ చేశారు. ఆదివారం వేదిక ఆధ్వర్యంలో క్లాక్టవర్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు.
అనంతపురం కల్చరల్, ఆగస్టు 25: కోల్కతాలో మహిళా డాక్టర్పై హత్యాచారానికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని పౌర చైతన్య వేదిక జిల్లా కన్వీనర్ రాఘవేంద్ర డిమాండ్ చేశారు. ఆదివారం వేదిక ఆధ్వర్యంలో క్లాక్టవర్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. రాఘవేంద్ర మాట్లాడుతూ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ప్రసారం చేస్తున్న అశ్లీలత, పోర్నోగ్రఫీ వెబ్సైట్లు, మద్యం, మాదకద్రవ్యాలు వంటివి మహిళలపై అత్యాచారాలకు కారణమవుతున్నాయన్నారు. వీటిని ప్రభుత్వా లు వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశారు. మానవహక్కుల వేదిక నాయకుడు ఎస్ఎం బాషా, మానవతా రక్తదాతల సంస్థ తరిమెల అమరనాథరెడ్డి, పౌర చైతన్యవేదిక నాయకులు తబ్రేజ్ ఖాన, నాగముత్యాలు పాల్గొన్నారు.
Updated Date - Aug 26 , 2024 | 12:34 AM