వైసీపీతో విసిగిపోయారు
ABN, Publish Date - Mar 22 , 2024 | 12:08 AM
కొత్తచెరువు, మార్చి 21: వైసీపీ చేస్తున్న ఆకృత్యాలతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకే విసుగు వచ్చిందని, అందుకే చాలామంది అక్కడ ఇమడలేక టీడీపీలోకి వస్తున్నారని మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి విమర్శించారు.
-అందుకే ఆ పార్టీ శ్రేణులు టీడీపీలోకి వస్తున్నారు
- మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి విమర్శ
- ఆయన సమక్షంలో తెలుగుదేశంలోకి 200 కుటుంబాలు చేరిక
కొత్తచెరువు, మార్చి 21: వైసీపీ చేస్తున్న ఆకృత్యాలతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకే విసుగు వచ్చిందని, అందుకే చాలామంది అక్కడ ఇమడలేక టీడీపీలోకి వస్తున్నారని మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి విమర్శించారు. కొత్తచెరువులో గురువారం సుమారు 200 కుటుంబాల వారు వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి, ఆమె భర్త పల్లె వెంకట కృష్ణ కిశోర్ రెడ్డి పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారికి పల్లెరఘునాథరెడ్డి కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. సీఎం జగన చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలతో పాటు వైసీపీ కార్యకర్తలు సైతం విసిగి వేసారిపోయారని అన్నారు. అందుకే ఆ పార్టీని వీడి టీడీపీలోకి చేరుతున్నారని అన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు సాలక్కగారిశ్రీనివాసులు, డాక్టర్స్వర్ణలత, ఒలిపిశీన, నరేంద్ర, మాజీ ఎంపీపీ వాణీశ్రీనివాస్, మాజీ సర్పంచ మాణిక్యంబాబా, నాయకులు భాస్కర్, జనసేన నాయకులు పత్తిచంద్రశేఖర్, శివ, అల్లాబకాష్, మాధవి, రాధమ్మ, తులసీ, విజయ్, గుర్రప్ప, శ్రీరాములు పాల్గొన్నారు.
Updated Date - Mar 22 , 2024 | 12:08 AM