విద్యాసంస్థల్లో ఖాళీలు భర్తీ చేయాలి
ABN, Publish Date - Aug 03 , 2024 | 11:38 PM
జూనియర్ కళాశాలలు, హాస్టళ్లు, డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఏఐఎ్సఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన మూడు రోజులు జీపుజాతా శనివారం ఆత్మకూరు ప్రభుత్వ హైస్కూల్లో ముగించారు.
అనంతపురం విద్య, ఆగస్టు 3: జూనియర్ కళాశాలలు, హాస్టళ్లు, డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఏఐఎ్సఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన మూడు రోజులు జీపుజాతా శనివారం ఆత్మకూరు ప్రభుత్వ హైస్కూల్లో ముగించారు. కార్యక్రమానికి ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాన్సనబాబు, జిల్లా అధ్యక్షుడు రమణయ్య, ప్రధాన కార్యదర్శి కుళ్లాయిస్వామి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారానికి జీపుజాతా నిర్వహించామన్నారు. హాస్టళ్లకు పెండింగ్లో ఉన్న అన్ని రకాల బిల్లులు చెల్లించాలన్నారు. ఆత్మకూరులో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వ హాస్టల్కు వెంటనే నూతన భవనం నిర్మించాలని కోరారు. ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ వద్ద 6వ తేదీ ధర్నా చేయనున్నట్లు స్పష్టం చేశారు. విద్యార్థులు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సమితి సభ్యులు సాయి స్వరూప, జిల్లా నాయకులు రాధాజ్యోతి, కోశాధికారి హనుమంతు, నరసింహ యాదవ్, వెంకట్ నాయక్, వంశీ, వినోద్, సీపీఐ రామకృష్ణ, మంజునాథ్, సమీర్, ఆనంద్, తారక్ పాల్గొన్నారు.
Updated Date - Aug 03 , 2024 | 11:38 PM