MLA DAGGUPATI: శిల్పారామానికి పూర్వవైభవం తెస్తాం
ABN, Publish Date - Jul 19 , 2024 | 11:43 PM
శిల్పారామానికి పూర్వ వైభవం తీసుకొస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. శుక్రవారం ఉదయం రాజీవ్కాలనీ పంచాయతీలోని శిల్పారామాన్ని ఆయన పరిశీలించారు. సంబంధిత అధికారులతో కలియతిరిగారు. పార్కులోని ప్రతి ఒక్కటి పరిశీలించారు. టాయిలెట్లు, నీటి సౌకర్యం లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
అనంతపురం రూరల్, జూలై 19: శిల్పారామానికి పూర్వ వైభవం తీసుకొస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. శుక్రవారం ఉదయం రాజీవ్కాలనీ పంచాయతీలోని శిల్పారామాన్ని ఆయన పరిశీలించారు. సంబంధిత అధికారులతో కలియతిరిగారు. పార్కులోని ప్రతి ఒక్కటి పరిశీలించారు. టాయిలెట్లు, నీటి సౌకర్యం లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..హైదరాబాదులోని శిల్పారామానికి మించి ఇక్కడ ఉందన్నారు. కానీ కేవలం టీడీపీ అభివృద్ధి చేసిందన్న ఒకే ఒక్క కారణంతో గత ప్రభుత్వం దీనిని నిర్లక్ష్యం చేసిందన్నారు. ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి పరిశీలించిన పాపాన పోలేదన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసినవన్నీ నాశనం చేశారన్నారు. సీఎం చంద్రబాబును కలిసి శిల్పారామం అభివృద్ధికి నిధులు తీసుకొస్తామన్నారు. శిల్పారామం ఏఓ క్రిష్ణప్రసాద్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయల్ మురళి, జిల్లా ఉపాధ్యక్షుడు డిష్నాగరాజు, పార్లమెంట్ కోఆర్డినేటర్ కూచి హరి, జడ్పీ మాజీ చైర్మన చమన సాబ్ తనయుడు ఉమర్, నాయకులు రాయల్ మధు, హరిప్రసాద్, లింగమయ్యస్వామి, రాజేంద్ర, కాటమయ్య, సాధిక్, శోభ, శశికళ, అశోక్, ప్రభాకర్, బాబు, వెంకటేష్ పాల్గొన్నారు.
Updated Date - Jul 19 , 2024 | 11:43 PM