ANNA CANTEEN: 15న అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తాం
ABN, Publish Date - Aug 13 , 2024 | 12:10 AM
నగరంలో 15వ తేదీ నుంచి అన్న క్యాంటీన్ల ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక బళ్లారి బైపా్సలోని అన్న క్యాంటీనను ఎమ్మెల్యే పరిశీలించారు. క్యాంటీనలోని ఫర్నిచర్, తాగునీరు, వంట గదిని పరిశీలించారు.
అనంతపురం అర్బన, ఆగస్టు 12: నగరంలో 15వ తేదీ నుంచి అన్న క్యాంటీన్ల ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక బళ్లారి బైపా్సలోని అన్న క్యాంటీనను ఎమ్మెల్యే పరిశీలించారు. క్యాంటీనలోని ఫర్నిచర్, తాగునీరు, వంట గదిని పరిశీలించారు. ఎక్కడా చిన్న లోటు లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. పేదలకు అన్నం పెట్టే ఈ కార్యక్రమాన్ని సేవా భావంతో చూడాలన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు మూడు పూటలా అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను తన అహంకారంతో జగనరెడ్డి మూసివేయించారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే క్యాంటీన్లను తిరిగి పునరుద్ధరించామన్నారు. నగరంలోని మూడు క్యాంటీన్లను రూ.30 లక్షలతో మరమ్మతులు చేయించామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు క్యాంటీన్లను తిరిగి పునఃప్రారంభిస్తున్నామన్నారు. ప్రస్తుతం నిత్యావసర ధరలు పెరిగినా క్యాంటీన్లలో ధరలు పెంచడం లేదన్నారు. అడిషనల్ కమిషనర్ హరిబాబు, ఈఈ సూర్యనారాయణ, ఏఈ శంకర్, టీడీపీ నాయకులు రాయల్ మురళీ, గంగారామ్, డిష్ నాగరాజు, నెట్టెం బాలకృష్ణ, రాయల్ మధు, దళవాయి వెంకటనారాయణ, సంగా తేజస్విని, వడ్డే భవాని, లక్ష్మీనరసింహ, ఓంకార్రెడ్డి, రమేష్ బాబు, జోగి రాజేంద్ర, గోళ్ల సుధాకర్నాయుడు పాల్గొన్నారు.
టీడీపీ నాయకుడికి పరామర్శ: టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుగ్గయ్య చౌదరి తన ఇంట్లో ప్రమాదవశాత్తు కిందపడి గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను సోమవారం రాత్రి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పరామర్శించారు.
Updated Date - Aug 13 , 2024 | 12:10 AM