Andhra Pradesh: ప్రభుత్వానికి ఎదురుదెబ్బ... ఆ ఆదేశాలు కొనసాగుతాయన్న హైకోర్టు..
ABN, Publish Date - Jan 12 , 2024 | 03:48 PM
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని కార్యాలయాల తరలింపు పై
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని కార్యాలయాల తరలింపు పై సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని ధర్మానసం పేర్కొంది. సింగిల్ జడ్జి ఆదేశాలను తాము లిఫ్ట్ చేయలేమన్న బెంచ్.. మీరే త్రిసభ్య ధర్మాసనానికి పంపాలని కోరుతున్నట్లు వెల్లడించింది. ఈ అప్పీల్ ను ఎవరు వినాలి అనేది త్వరలో ప్రకటిస్తామని చెప్పింది.
క్యాంప్ ఆఫీస్ పేరుతో రాజధాని కార్యాలయాల తరలింపుపై హైకోర్ట్ లో విచారణ జరిగింది. దీనికి ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఎన్ని కార్యాలయాలు, ఎంతమంది అధికారులు విశాఖకు తరలిస్తారు. ఎంత విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నారు., ఎంత మంది అధికారులు వెళ్తున్నారు అనే అంశంపై వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Updated Date - Jan 12 , 2024 | 03:49 PM