ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP : వరద బాధితులకు జనసేన చేయూత

ABN, Publish Date - Sep 07 , 2024 | 04:21 AM

విజయవాడలో వరద బాధితులకు చేయూత నిచ్చేందుకు జనసేన ఎన్‌ఆర్‌ఐ, ఆమెరికా విభాగం ముందుకొచ్చింది.

అమరావతి, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): విజయవాడలో వరద బాధితులకు చేయూత నిచ్చేందుకు జనసేన ఎన్‌ఆర్‌ఐ, ఆమెరికా విభాగం ముందుకొచ్చింది. బాధితుల కోసం సిద్ధంచేసిన నిత్యావసర సరుకుల వాహనాలను ఎమ్మెల్సీ హరిప్రసాద్‌ జెండా ఊపి ప్రారంభించారు. పెద్దపులిపాకలో 1,020 కుటుంబాలకు రూ.20 లక్షలు విలువైన నిత్యావసర కిట్లను అందించనున్నారు. ఒక కిట్‌లో 8 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో ఉల్లిపాయలు, లీటర్‌ వంటనూనె, కిలో ఉప్పు, కారం, చింతపండు ఉన్నాయి. జనసేన ఎన్‌ఆర్‌ఐ విభాగాన్ని ఎమ్మెల్సీ అభినందించారు. వీరితో పాటు వరద బాధితుల సహాయార్థం పార్టీ కార్యక్రమాల కమిటీ కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు 400 చీరలు, 400 దుప్పట్లు 2 వేల బిస్కెట్‌ ప్యాకెట్లు సిద్ధం చేశారు.

Updated Date - Sep 07 , 2024 | 04:21 AM

Advertising
Advertising