టీడీపీలో చేరిన బలిజ నేత
ABN, Publish Date - May 03 , 2024 | 05:06 AM
నంద్యాల జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన బలిజ సామాజిక వర్గాన్ని వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి పట్టించుకోకపోవడంతో కాపు నేతలు తీవ్ర నిరాశకు గురయ్యారు.
నంద్యాల జిల్లాలో వైసీపీకి షాక్
నంద్యాల (నూనెపల్లె), మే 2: నంద్యాల జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన బలిజ సామాజిక వర్గాన్ని వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి పట్టించుకోకపోవడంతో కాపు నేతలు తీవ్ర నిరాశకు గురయ్యారు. గత ఎన్నికల్లో బలిజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో బలిజ సంఘం నాయకుడు, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ఐఎంఏ యాక్షన్ కమిటీ చైర్మన్ జి.రవికృష్ణ వైసీపీని వీడి టీడీపీలో చేరారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఏవీఆర్ ప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును కలిశారు. డాక్టర్ రవికృష్ణను చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
Updated Date - May 03 , 2024 | 05:06 AM