ఎండుతున్న అరటి తోటలు
ABN, Publish Date - May 16 , 2024 | 11:17 PM
వర్షం జాడ లేకపోవడంతో భూగర్భజలాలు అడుగంటిపోయి అరటితోటలు ఎండిపోతున్నాయి. మండలంలో అరటిసాగు సుమారు వెయ్యి ఎకరాలకు పైగా సాగులో ఉంది.
యల్లనూరు, మే 16: వర్షం జాడ లేకపోవడంతో భూగర్భజలాలు అడుగంటిపోయి అరటితోటలు ఎండిపోతున్నాయి. మండలంలో అరటిసాగు సుమారు వెయ్యి ఎకరాలకు పైగా సాగులో ఉంది. ఈ పంటను జనవరి నుంచి సాగుచేశారు. గత ఏడాది వర్షాలు తక్కువ కావడంతో భూగర్భజలాలు తగ్గిపోయాయి. దీంతో కూచివారిపల్లి, బొప్పేపల్లి, వాసాపురం గ్రామాల్లో సాగుచేసిన అరటి పంట నీరు అందక ఎండిపోతోంది.
Updated Date - May 16 , 2024 | 11:17 PM