పిచ్చికుక్క కరిచి వృద్ధురాలి మృపిచ్చికుక్క కరిచి వృద్ధురాలి మృతితి
ABN, Publish Date - Apr 08 , 2024 | 01:18 AM
పిచ్చికుక్క కరిచి ఒక వృద్ధురాలు మృతి చెందిన ఘటన రేణిగుంట బుగ్గవీధిలో చోటు చేసుకుంది.
రేణిగుంట, ఏప్రిల్ 7: పిచ్చికుక్క కరిచి ఒక వృద్ధురాలు మృతి చెందిన ఘటన రేణిగుంట బుగ్గవీధిలో చోటు చేసుకుంది.బుగ్గవీధిలో నివాసముండే తల్లీకొడుకులు సైదాన్బీ(78), హుస్సేన్ కూలి పనులతో జీవనం సాగిస్తుం టారు.సైదాన్బీకి ఇటీవల కాలు విరిగిపోవడంతో కర్ర సాయంతో నడుస్తుంటోంది.ఈ నెల నాల్గవ తేదీ సాయంత్రం తన ఇంటి చివర్లో బహిర్భూమికి వెళ్లగా ఓ పిచ్చికుక్క సైదాన్బీని ఎడమచెయ్యి మణికట్టుతో పాటు పలు చోట్ల శరీరంపై కరిచేసింది.దీంతో కిందపడిపోయిన సైదాన్బీ వయసు మీరడంతో పెద్దగా అరవలేకపోయింది. బహిర్భూమికని వచ్చిన మరో వ్యక్తి అక్కడ పడిఉన్న సైదాన్బీని చూసి కుమారుడికి సమాచారం ఇచ్చాడు. దీంతో ఆమెను హుటాహుటిన స్థానికంగా వున్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా ఇంజక్షన్తో పాటు కుట్లు వేయించారు. తీవ్రమైన నొప్పితో సైదాన్బీ ఇబ్బంది పడుతుండడంతో 6వతేదీ వుదయం తిరుపతి రుయాస్పత్రిలో చేర్చారు. అక్కడ ఈసీ, స్కానింగ్ తీసి చేతికి ఆపరేషన్ నిర్వహించి కట్టుకట్టారు.ఆదివారం మధ్యాహ్నం 3గంటలకు చికిత్స పొందుతూ సైదాన్బీ మృతి చెందింది. సైదాన్బీని కరిచిన పిచ్చికుక్క ఇప్పటికి రెండు మూడు వీధుల్లో తిరుగుతూ ఏడుగురిని కరిచిందని తెలియడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Apr 08 , 2024 | 01:18 AM