రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
ABN, Publish Date - May 27 , 2024 | 12:37 AM
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులకు ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో లక్ష్మీశ సూచించారు. రుయా, స్విమ్స్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న రోగులను ఆదివారం పరామర్శించారు. ఆరోగ్యశ్రీ సేవలు ఎలా అందిస్తున్నారు.. నగదు ఏమైనా తీసుకుంటున్నారా అని రోగులను అడిగి తెలుసుకున్నారు.
తిరుపతి(వైద్యం), మే 26: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులకు ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో లక్ష్మీశ సూచించారు. రుయా, స్విమ్స్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న రోగులను ఆదివారం పరామర్శించారు. ఆరోగ్యశ్రీ సేవలు ఎలా అందిస్తున్నారు.. నగదు ఏమైనా తీసుకుంటున్నారా అని రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అత్యవసర విభాగం, ఐసీయూ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులనూ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో శ్రీహరి, రుయా సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రభు, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వీకుమార్, ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త డాక్టర్ రాజశేఖర్రెడ్డి, మేనేజరు శివకుమార్, బీఐవో ప్రత్యేకాధికారి డాక్టర్ జయచంద్రారెడ్డి, ఎంఎస్ డాక్టర్ రామ్, డిప్యూటీ కలెక్టర్ భాస్కర్నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 27 , 2024 | 12:37 AM