31మంది వలంటీర్ల రాజీనామా
ABN, Publish Date - Apr 05 , 2024 | 02:03 AM
మరో 31మంది వలంటీర్లు రాజీనామా బాటపట్టారు.వైపీపీ నేతల ఒత్తిళ్లతో చాలామంది వలంటీర్లు రాజీనామాలు చేసి వైసీపీ ప్రచారంలో పాల్గొంటున్న విషయం తెలిసిందే.
తిరుపతి(కలెక్టరేట్), ఏప్రిల్ 4: మరో 31మంది వలంటీర్లు రాజీనామా బాటపట్టారు.వైపీపీ నేతల ఒత్తిళ్లతో చాలామంది వలంటీర్లు రాజీనామాలు చేసి వైసీపీ ప్రచారంలో పాల్గొంటున్న విషయం తెలిసిందే.జిల్లావ్యాప్తంగా గురువారం నాటికి 67మంది వలంటీర్లు రాజీనామా చేసినట్లు సమాచారం.వీరిలో గురువారమే కోట మండలంలో 24మంది, ఏర్పేడులో ఐదుగురు, పుత్తూరు ఇద్దరు వలంటీర్లు రాజీనామా చేశారు.ఈ క్రమంలో ప్రభుత్వం ఇచ్చిన సెల్ఫోన్లు, ఇతర డివైజర్లతో పాటు వారి పరిఽధిలో 50 కుటుంబాల సమగ్ర సమాచారాన్ని, హౌస్హోల్డ్ మ్యాపింగ్ పుస్తకాలను అధికారులకు తిరిగివ్వాల్సివుంది. అయితే వాటిని వెనక్కు ఇవ్వడంలేదన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.
Updated Date - Apr 05 , 2024 | 08:05 AM