గిన్నిస్ రికార్డు సృష్టించిన డెర్మటాలజిస్టులు
ABN, Publish Date - May 26 , 2024 | 01:44 AM
చర్మవ్యాధులపై సామాన్య ప్రజలకు అవగాహన కల్పించేందుకు 24 గంటల్లో దేశవ్యాప్తంగా సుమారు పది వేల మంది చర్మవ్యాధుల వైద్యనిపుణులు ప్రతిజ్ఞ చేశారు.
24 గంటల్లో 9405 మంది వైద్యుల ప్రతిజ్ఞ
గుంటూరు (మెడికల్), మే 25: చర్మవ్యాధులపై సామాన్య ప్రజలకు అవగాహన కల్పించేందుకు 24 గంటల్లో దేశవ్యాప్తంగా సుమారు పది వేల మంది చర్మవ్యాధుల వైద్యనిపుణులు ప్రతిజ్ఞ చేశారు. మే 5, 6 తేదీల్లో గుర్తింపు పొందిన 9405 మంది డెర్మటాలజిస్టులు చేసిన వాగ్దానాలను ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజీ, వెనీరియాలజీ, లెప్రాలజీ (ఐఏ డీవీఎల్) సంఘం జాతీయ శాఖ సేకరించి గిన్నిస్ నిర్వాహకులకు పంపగా వరల్డ్ రికార్డుగా నమోదు చేశారు. ఐఏ డీవీఎల్ ఏపీ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ అత్తోట కవిత, డాక్టర్ జే సౌజన్య ఈవిషయం వెల్లడించారు.
Updated Date - May 26 , 2024 | 08:25 AM