సెల్షాపులో అగ్నిప్రమాదం
ABN, Publish Date - May 14 , 2024 | 11:46 PM
సుమారు రూ.15లక్షలు ఆస్తినష్టం కాజులూరు, మే 14: కాజులూరులో ఓ మొబైల్షాపులో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో సుమా రు రూ.15లక్షల వరకు నష్టం జరిగినట్లు తెలుస్తుంది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం.. కాజులూరు గ్రామానికి చెందిన బలభద్రుని కామేష్కి చెందిన మొబైల్షాపులో
సుమారు రూ.15లక్షలు ఆస్తినష్టం
కాజులూరు, మే 14: కాజులూరులో ఓ మొబైల్షాపులో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో సుమా రు రూ.15లక్షల వరకు నష్టం జరిగినట్లు తెలుస్తుంది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం.. కాజులూరు గ్రామానికి చెందిన బలభద్రుని కామేష్కి చెందిన మొబైల్షాపులో మంగళవారం మంటలు వ్యాపించాయి. సమాచారం తెలుసుకుని షాపు షెట్టర్ తెరిచే లోపు షాపులోని సామాగ్రి మొత్తం కాలి బూడిదయ్యాయి. షాపులో ఉన్న ఖరీదైన సెల్ఫోన్లు, స్మార్ట్వాచ్లు, ఇతర ఖరీదైన సామాగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు. రూ.15లక్షల వరకు ఆస్తినష్టం సంభవించిందని బాధితులు పేర్కొన్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Updated Date - May 14 , 2024 | 11:46 PM