సైనికుల త్యాగం అజరామరం
ABN, Publish Date - Jul 27 , 2024 | 12:26 AM
పెద్దాపురం, జూలై 26: దేశ రక్షణలో సైనికుల త్యాగం అజరామరం అని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి అన్నారు. శుక్రవారం కార్గిల్ విజయ్ దివస్ వేడుకలను పురస్కరించుకుని పట్టణానికి చెందిన మాజీ సైని కుడు డాక్టర్ గుమ్మెళ్ల పట్టాభిరామశేఖర్ను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కా
జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు
కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు
పెద్దాపురం, జూలై 26: దేశ రక్షణలో సైనికుల త్యాగం అజరామరం అని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి అన్నారు. శుక్రవారం కార్గిల్ విజయ్ దివస్ వేడుకలను పురస్కరించుకుని పట్టణానికి చెందిన మాజీ సైని కుడు డాక్టర్ గుమ్మెళ్ల పట్టాభిరామశేఖర్ను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజాసూరిబాబు రాజు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బిక్కిన విశ్వేశ్వరరావుతోకలిసి సత్కరించారు. అనంతరం తుమ్మల మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ దేశభక్తిని చాటుతూ భవిష్యత్ తరాలు మరింత విజయవంతం గా ముందుకెళ్లేలాప్రోత్సహించాలన్నారు. యుద్ధంలో పాల్గొన్న సైనికులను గౌరవించుకోవడం మన విధి అన్నారు. బీజేపీ నేతలు దుర్గా మోహన్రావు, రవికిరణ్, తుమ్మల పద్మజ, రవికృష్ణ, ప్రసాద్, సర్వస్దిద్ది సతీష్, చీకట్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Updated Date - Jul 27 , 2024 | 12:26 AM