చంద్రబాబు పర్యటన బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ
ABN, Publish Date - Apr 22 , 2024 | 12:38 AM
జగ్గంపేట, ఏప్రిల్ 21: జగ్గంపేటలో సోమవారం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను ఆదివారం ఎస్పీ సతీష్కుమార్, డీఎస్పీ లతాకుమారి, సీఐ లక్ష్మణరావు, సర్కిల్ ఎస్ఐలు పరి శీలించారు. హెలిప్యాడ్, రోడ్షో నిర్వహించే ప్రాంతాలను పరిశీలించి సూచనలు ఇచ్చారు. జగ్గం
జగ్గంపేట, ఏప్రిల్ 21: జగ్గంపేటలో సోమవారం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను ఆదివారం ఎస్పీ సతీష్కుమార్, డీఎస్పీ లతాకుమారి, సీఐ లక్ష్మణరావు, సర్కిల్ ఎస్ఐలు పరి శీలించారు. హెలిప్యాడ్, రోడ్షో నిర్వహించే ప్రాంతాలను పరిశీలించి సూచనలు ఇచ్చారు. జగ్గంపేట టీడీపీ కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిశీలన
గండేపల్లి, ఏప్రిల్ 21: మండలంలోని సమస్యాత్మక పోలిం గ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ ఎస్.సతీష్కుమార్ పరిశీలించారు. ప్రజలతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నారు. ప్రతీ ఒక్కరూ ఓటుహక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోవాలన్నారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ, పెద్దాపురం డీఎస్పీ లతాకుమారి, జగ్గంపేట సీఐ లక్ష్మణరావు, గండేపల్లి ఎస్ఐ రామకృష్ణ పాల్గొన్నారు.
Updated Date - Apr 22 , 2024 | 12:38 AM