ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రావులపాలెం పోలీస్‌స్టేషన్‌పై ఏసీబీ దాడులు

ABN, Publish Date - May 26 , 2024 | 01:39 AM

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెం పోలీస్‌స్టేషన్‌పై ఏసీబీ అధికారులు శనివారం అకస్మిక దాడులు చేశారు. రావులపాలెం టౌన్‌ సీఐ ఆంజనేయులు రూ.50వేలు లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబ డ్డాడు. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ డి.శ్రీహరిరాజు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి...

రూ.50వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీఐ ఆంజనేయులు

రావులపాలెం, మే 25: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెం పోలీస్‌స్టేషన్‌పై ఏసీబీ అధికారులు శనివారం అకస్మిక దాడులు చేశారు. రావులపాలెం టౌన్‌ సీఐ ఆంజనేయులు రూ.50వేలు లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబ డ్డాడు. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ డి.శ్రీహరిరాజు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి... గత నెల 16వ తేదీన రావులపాలెం మండలం పొడగట్లపల్లి వద్ద కోడిపందాల శిబిరంపై పోలీసులు దాడి చేసి పలువురిని అరెస్టు చేశారు. అందులో రావులపాలేనికి చెందిన కుంచెర్లపాటి లక్ష్మణరాజు కూడా ఉన్నారు. లక్ష్మణరాజుపై చార్జిషీట్‌ ఓపెన్‌ చెయ్యకుండా ఉండేందుకు సీఐ ఆంజనేయులు రూ.50వేలు డిమాండ్‌ చేశాడు. దీంతో లక్ష్మణరాజు రాజమహేంద్రవరం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. లక్ష్మణరాజు నుంచి సీఐ రూ.50వేలు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ శ్రీహరిరాజు ఆధ్వర్యంలో దాడిచేసి పట్టుకున్నారు. కేసు నమోదు చేశారు.

Updated Date - May 26 , 2024 | 08:22 AM

Advertising
Advertising