ఫైబర్నెట్ చైర్మన్ గౌతంరెడ్డి రాజీనామా ఆమోదం
ABN, Publish Date - Jun 11 , 2024 | 02:17 AM
ఏపీ స్టేట్ ఫైబర్నెట్ లిమిటెడ్ చైర్మన్ పి.గౌతంరెడ్డి, ఏపీ మారీటైమ్ బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి, ఏపీ ఇన్ల్యాండ్ వాటర్వేస్ అథారిటీ బోర్డు చైర్మన్ దంతులూరి దిలీ్పకుమార్ల రాజీనామాలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది.
మారీటైమ్, ఇన్ల్యాండ్ వాటర్వేస్ చైర్మన్ల రాజీనామాలు కూడా..
ఏపీ స్టేట్ ఫైబర్నెట్ లిమిటెడ్ చైర్మన్ పి.గౌతంరెడ్డి, ఏపీ మారీటైమ్ బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి, ఏపీ ఇన్ల్యాండ్ వాటర్వేస్ అథారిటీ బోర్డు చైర్మన్ దంతులూరి దిలీ్పకుమార్ల రాజీనామాలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వివిధ కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థల బోర్డులకు చైర్మన్లు, డైరెక్టర్లుగా నియమితులైనవారందరి రాజీనామాలు తీసుకుని ఆమోదించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వైసీపీకి చెందిన గౌతంరెడ్డి, కాయల వెంకటరెడ్డి, దిలీ్పకుమార్లు రాజీనామాలు సమర్పించగా, వాటిని ఆమోదిస్తూ ప్రభుత్వం సోమవారం గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసింది.
Updated Date - Jun 11 , 2024 | 07:43 AM